వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ ఓదార్పు యాత్ర ముఖ్యమంత్రి రోశయ్యకు పెద్ద సవాల్

By Santaram
|
Google Oneindia TeluguNews

YS Jagan
జగన్ ఓదార్పు యాత్ర రోశయ్యకు పెద్ద తలనొప్పి కానుంది. జగన్ యాత్రకు జనం బాగా స్పందించే అవకాశాలున్నాయి. వైఎస్ కు ఉన్న ప్రజాదరణ, ఓదార్పు యాత్రలో ఉన్న సెంటిమెంట్ బలం దీనికి కారణాలు. వద్దన్నా ఓదార్పు యాత్రకు వెళ్తున్న జగన్ పై కాంగ్రెస్ అధిష్టానవర్గం ఆగ్రహంగా ఉన్నట్టు కన్పిస్తోంది. అయితే సున్నితమైన ఈ విషయంలో హై కమాండ్ తొందరపడే అవకాశం లేదు. జగన్ ను సస్పెండ్ చేయాలన్న అభిప్రాయాన్ని కొందరు సీనియర్ నాయకులు వ్యక్తం చేసినప్పటికీ సోనియా గాంధీ మాత్రం ఆచితూచు వ్యవహరిస్తున్నారు. ఈ విషయంలో ఆమెకు సలహాదారుగా ఉన్న సీనియర్ నాయకుడు నేదురుమల్లి జనార్ధనరెడ్డి జగన్ కు అనుకూలంగా ఉన్నారు. తండ్రి వైఎస్ కు ఉన్న జనాకర్షణ శక్తి జగన్ కూ ఉందని ఆమెకు చెబుతూ వస్తున్నారు. జగన్ శ్రీకాకుళంతో ఓదార్పు యాత్రను వదిలేస్తే గొడవ ఉండేది కాదు. రాష్ట్రంలో అతి పెద్ద జిల్లా యిన తూర్పు గోదావరిలో ఆయన పర్యటన పెట్టుకోవడం ముఖ్యమంత్రి రోశయ్యకు గోచి జారినంత అయ్యింది.

జగన్ తూర్పుగోదావరి పర్యటనలో ఎమ్మెల్యేలు ఊహించినదానికంటే ఎక్కువ సంఖ్యలో పాల్గొనే అవకాశముంది. నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి జగన్ యాత్రను బహిరంగంగా సమర్ధించారు. జగన్ యాత్ర కాంగ్రెస్ కు లాభం కలిగిస్తుందన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఏది ఏమైనా జగన్ యాత్ర సోనియాకు, రోశయ్యకు ఒక సవాలు వంటిది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X