జగన్ ను వదిలి రోశయ్యను పట్టేసిన కెవిపి

KVP Ramchandar Rao
కెవిపి రామచంద్రరావు ఎక్కడుంటే అక్కడ లక్ష్మీదేవి తాండవిస్తుందని రాజకీయ నాయకులు నమ్ముతారు. ఒకప్పుడు వైఎస్ రాజశేఖరరెడ్డికి కుడిభుజంగా ఉన్న కెవిపి ఇప్పుడు రోశయ్యకు అత్యంత సన్నిహితుడిగా మారారు. కెవిపి, వైఎస్ గుల్బర్గా మెడికల్ కాలేజిలో చదువుకున్నారు. అప్పటి నుంచి ఇద్దరిదీ ఎంతో గొప్ప స్నేహానుబంధం. కెవిపికి రాజ్యసభ సభ్యత్వం ఇప్పించుకోడానికి వైఎస్ ఎంతోకష్టపడవలసి వచ్చింది. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన కెవిపి వెలమ దొర. ఆ కులం ఓట్లు చాలా తక్కువ కాబట్టి ఆయన ప్రత్యక్ష ఎన్నికలకు ఎప్పుడూ సాహసించలేదు.

ఆయనకు రాష్ట్రంలో ఒక పదవి ఉంది. శాంతి భద్రతలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా కేబినెట్ హోదాలో ఉన్నారు. సచివాలయంలో ఇప్పటికీ ఆయన హవా కొనసాగుతున్నట్టు చెబుతున్నారు. పెద్ద పైరవీలు చేయడంలో ఆయనకు ఎవరూ సాటిరారని మంత్రులే అంటూ ఉంటారు. ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవలసిన పెద్ద పనుల వెనుక కెవిపి ఉంటారన్నది జగమెరిగిన సత్యం. వైఎస్ మరణం తర్వాత జగన్ ను అంటిపెట్టుకున్న ఈయన జగన్ కు సిఎం పదవి రాదని తెలుసుకుని ఇప్పుడు వైఎస్ కు సన్నిహితంగా మెలుగుతున్నారు. ఆయన జగన్ ను కలవడం బాగా తగ్గించారట. ఆయన ఎలక్షన్ కింగ్ కాకపోయినా కలెక్షన్ కింగ్ వాసికెక్కారు. రోశయ్యకు హైకమాండ్ కు మధ్య ఆయనే వారధి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+