నిమ్స్ ఆస్పత్రిలో సత్యం రాజు డీల్స్!

ఆయనను కలిసిన వారిలో కొందరు అడ్వకేట్లు ఉన్నా మిగితా వారంతా కోటీశ్వరులు, సమాజంలో పలుకుబడి ఉన్న వ్యక్తులని సిబిఐ అధికారులు ఒక జాబితాను న్యాయస్ధానానికి అందజేశారు. అంతమందితో అన్ని గంటల సేపు మాట్లాడుతున్న రామలింగరాజు ఆరోగ్యంగా ఉన్నట్టేనని, ఆయనను జైలుకు తరలించాలని వారు అభ్యర్ధించారు. పలుకుబడితో, ధనబలంతో రామలింగరాజు కేసును బలహీనం చేయడానికి ప్రయత్నించవచ్చన్న అనుమానం వ్యక్తం చేశారు. నిమ్స్ లో రాజును కలిసిన వ్యక్తుల జాబితాను చదివిన సీనియర్ సివిల్ జడ్జి బివిఎల్ ఎన్ చక్రవర్తి విస్మయం వ్యక్తం చేశారు. దీనిపై సమగ్ర నివేదిక ఇవ్వవలసిందిగా ఆయన చంచల్ గుడా జైలు సూపరింటెండెంట్ ను ఆదేశించారు.
సత్యం రాజుపై అమెరికాలోనూ సీరియస్ సివిల్, క్రిమినల్ కేసులు పెండింగ్ లో ఉన్నాయి. అనారోగ్యం పేరు చెప్పుకుని ఆయన ఆ కేసుల విచారణను వాయిదా వేయించుకుంటూ వస్తున్నారు. అక్కడ ఆకేసులు రుజువైతే రామలింగరాజు మరణించే వరకు జైళ్లలోనే గడపవలసి ఉంటుంది. డబ్బుతో, రాజకీయ పలుకుబడితో ఆయన ఇంకెంత కాలం నిమ్స్ ఎసీ సూట్ లో గడుపుతారో చూడాలి.
-
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
తెలుగు హీరోయిన్తో స్టార్ క్రికెటర్ ఎంగేజ్మెంట్! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు












Click it and Unblock the Notifications