వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిరంజీవికి అసెంబ్లీలో బ్యాక్ బెంచీయే

By Pratap
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
చేసుకున్నవారికి చేసుకున్నంత మహదేవ అన్నారు. చిరంజీవిని చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసులో విలీనం చేసిన తర్వాత ఆయనకు ఇబ్బంది వచ్చి పడింది. విలీనం వల్ల శానససభలో ఇప్పటి వరకు మొదటి వరుసలో కూర్చుంటున్న చిరంజీవి ఇక బ్యాక్ బెంచీకి పరిమితం కావాల్సి ఉంటుంది. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసులో విలీనం చేసినట్లు చిరంజీవి లేఖ ఇచ్చిన వెంటనే ఆయన బ్యాక్ బెంచీకి వెళ్లిపోవాల్సి ఉంటుంది. శానససభకు తొలిసారి ఎన్నికైన జాబితాలో ఆయన పడిపోతారు. ఇది తెలిసి చిరంజీవి కాస్తా అసంతృప్తి వ్యక్తం చేశారట. కానీ ఎవరు మాత్రం ఏం చేస్తారు, మరి.

చిరంజీవి 18 శాసనసభా స్థానాలను గెలుచుకుని రెండో అతి పెద్ద ప్రతిపక్షంగా మొదటి బెంచీలో కూర్చుంటూ వస్తున్నారు. కానీ పరిస్థితి మారిపోయింది కదా. ముందు వరుసలో కూర్చునే అవకాశం లేదా అని చిరంజీవి అమయాకంగా అడిగారని కూడా అంటున్నారు. అయితే, శాసనసభా పక్ష నేత స్పీకర్‌కు ఓ లేఖ ఇస్తే దాన్ని పరిశీలించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. విలీనం జరిగినట్లు లేఖ ఇవ్వకపోతే మాత్రం మొదటి వరుసలో కూర్చోవచ్చు. చిరంజీవి లేఖ ఇవ్వకపోతే విలీనం పూర్తయినట్లు కాదు, శాసనసభలో కాంగ్రెసుకు కష్టాలు వస్తే కాపాడడం ఆపద్భంధవుడి చేతులో ఉండదు. విలీనం పూర్తయితే, కాంగ్రెసు జారీ చేసే విప్‌కు చిరంజీవికి చెందిన శాసనసభ్యులు కూడా కట్టుబడి ఉండాల్సి వస్తుంది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చిరంజీవి కోసం ఏం మార్గాలు వెతుకుతారో చూడాలి.

English summary
As Prajarajyam party was merged in Congress MLA Chiranjeevi has to sit on back benches in Assembly.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X