కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్‌ను మాత్రమే గుర్తు పట్టారు

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
కడప లోకసభ స్థానంలోని ప్రజలు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు వైయస్ జగన్‌ను మాత్రమే గుర్తు పట్టారు. ఓ తెలుగు టీవీ చానెల్ ఇటీవల ఓ విచిత్రమైన కార్యక్రమాన్ని ప్రసారం చేసింది. కడప నియోజకవర్గంలోని ఓ అసెంబ్లీ స్థానంలో ఆ టీవీ చానెల్ కడప లోకసభ ముగ్గురు అభ్యర్థుల ఫొటోలు చూపించి, వీరిని గుర్తు పట్టారా అంటూ ఓటర్లను ప్రశ్నించింది. ఇది పోలింగుకు ముందు జరిగింది. నిరక్షరాస్యులైన ఓటర్లంతా వైయస్ జగన్‌ను మాత్రమే గుర్తు పట్టారు. కొద్ది మంది మాత్రం కాంగ్రెసు అభ్యర్థి డిఎల్ రవీంద్రా రెడ్డిని గుర్తు పట్టారు. ఇది అతి స్వల్పం.

తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎంవి మైసురా రెడ్డిని గుర్తు పట్టినవారు దాదాపు లేరనే చెప్పవచ్చు. జగన్‌ ఫొటో చూసి ఆయన పేరును టక్కున చెప్పేశారు. కొంత మంది వైయస్సార్ కుమారుడు జగన్ అని కచ్చితంగా చెప్పారు. కొంత మంది డిఎల్ రవీంద్రా రెడ్డిని దేవగుడి నారాయణ రెడ్డి అని చెప్పారు. అప్పుడే దాదాపుగా వైయస్ జగన్ విజయం ఖాయమైనట్లు భావించారు.

English summary
Kadapa loksabha people recognised YSR Congress party leader YS Jagan only. They failed recognise Congress candidate DL Ravindra Reddy and TDP candidate MV Mysoora Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X