భాను దందాలో టీవీ యాంకర్

Bhanu Kiran
మద్దెలచెర్వు సూరి హత్య కేసులో నిందితుడు భాను కిరణ్ దందాలో ఓ టీవీ యాంకర్ పాత్ర వెలుగులోకి వచ్చింది. మహబూబ్‌నగర్ జిల్లాలోని తలకొండపల్లి మండలంలో భాను కిరణ్ అక్రమంగా 25 ఎకరాల భూమిని అక్రమంగా కబ్జా చేశాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆ ఆక్రమణకుగాను భాను కిరణ్ ఓ టీవీ యాంకర్‌ను వాడుకోవడానికి ప్రయత్నించాడు. బొజ్జి రెడ్డి అనే వ్యక్తి కూతురు సునీత పేర ఉన్న భూమిని రిజిష్టర్ చేయించుకోవడానికి భాను కిరణ్ ముఠా ఆ టీవీ యాంకర్‌ను వాడుకోవడానికి ప్రయత్నించాడు. ఆ యాంకర్ సునీతను పోలి ఉందట. దాంతో ఆమెను సునీతగా నమ్మించి ఆమె సంతకంతో భూమిని తమ పేర్ల మీదికి మార్చుకోవడానికి భాను కిరణ్ ముఠా ప్రయత్నించిదని అంటున్నారు. సునీతను బాగా ఎరిగిన ఓ ప్రజాప్రతినిధి అనుమానాలు వ్యక్తం చేయడంతో ఆ టీవీ యాంకర్ కథ ఎదురు తిరిగినట్లు సమాచారం. అయితే, ఆ తర్వాత మరో మార్గంలో భాను కిరణ్ ఆ భూమిని కబ్జా చేశాడని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+