వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రచారం చేయించి...: సిఎంపై బొత్స వ్యూహం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Botsa Satyanarayana and Kiran Kumar Reddy
ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మధ్య ఆధిపత్య కోరు కొనసాగుతున్నట్లుగా కనిపిస్తోంది. అందులో భాగంగా ఉప ఎన్నికల్లో ముఖ్యమంత్రిచే ప్రచారం చేయించి వ్యతిరేక ఫలితాలు వస్తే అందుకు బాధ్యుడిని కిరణ్‌నే చేయాలనే వ్యూహంతో వెళుతున్నారని అంటున్నారు. త్వరలో తెలంగాణలోని ఆరు నియోజకవర్గాలు, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కొవ్వూరు నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత మరికొద్ది రోజుల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం ఎమ్మెల్యేలపై వేటు పడుతుంది. ఇటు జగన్‌కు సానుభూతి, అటు తెలంగాణ సెంటిమెంట్ కారణంగా కాంగ్రెసుకు చాలా నియోజకవర్గాల్లో వ్యతిరేక ఫలితాలే వచ్చే అవకాశముంది.

ప్రధానంగా తెలంగాణలోని ఏడు నియోజకవర్గాల్లో కాంగ్రెసుకు కష్టమేనని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో ఆయా నియోజకవర్గాల్లో ముఖ్యమంత్రితో ప్రచారం చేయించి వ్యతిరేక ఫలితాలు వస్తే అందుకు బాధ్యత అతని పైనే వేయాలనే వ్యూహంతో బొత్స వెళుతున్నారట. ముఖ్యమంత్రి వర్గం కూడా బొత్స వర్గం వ్యూహాలను దెబ్బకొట్టేందుకు స్కెచ్ వేస్తున్నదని అంటున్నారు. సిఎం, పిసిసి చీఫ్ మధ్య ఆధిపత్య పోరు పార్టీకి మొదటికే మోసం చేసేలా ఉందని మరికొందరు నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని అంటున్నారు. పార్టీ సీనియర్లు మాత్రం నియోజకవర్గం గెలుపోటముల బాధ్యతను జిల్లా మంత్రులకే అప్పగించాలని సూచిస్తున్నారట.

English summary
It seems, PCC chief Botsa Satyanarayana and CM Kiran Kumar Reddy are chalked out their strategies for domination.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X