తెలంగాణ జెఏసిలో 'వి'భిన్న స్వరాలు?

గతంలోనూ జెఏసిలో విభేదాలు ఉన్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. టిఆర్ఎస్ ఒంటెత్తు పోకడలతో విసిగిన బిజెపి, సిపిఐ(న్యూడెమోక్రసి) జెఏసి నుండి బయటకు రావాలని కూడా భావిస్తున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. విభేదాలను ఆ తర్వాత అన్ని పార్టీలు ఖండించాయి. తాజాగా మళ్లీ కేవలం బిజెపి వల్లనే తెలంగాణ సాధ్యమని కిషన్ రెడ్డి అనటం, ఆయన వ్యాఖ్యలపై కెసిఆర్ అసంతృప్తి వ్యక్తం చేయడం గమనార్హం. అంతేకాకుండా శనివారం జరిగిన జెఏసి సమావేశంలో, కాంగ్రెసు, టిడిపిలను మనమెందుకు నిందించాలి, తెలంగాణ కోసం మన ఉద్యమం మన ఉద్యమం మనం చేసుకుంటూ పోతే సరిపోతుందని కదా అని ఓ జెఏసి నేత అభిప్రాయపడ్డారట. దానిపై కూడా కెసిఆర్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ, తెలంగాణ వ్యతిరేకులైన కాంగ్రెసు, టిడిపిలను రాజకీయంగా అంతం చేయకుండా రాష్ట్రం ఎలా సాధిస్తామని చెప్పినట్లుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications