బాపూజీ మతమార్పిడి?: బాప్టిస్ట్గా మార్చిన చర్చి
గతంలో అమెరికన్ అధ్యక్ష పదవికి పోటీపడిన జాన్కెర్రీ, 2012 అధ్యక్ష పదవి రేసులో ఉన్న మిట్ రోమ్నీ వంటివారు ప్రముఖ మోర్మన్లు. గాంధీజీ పేరు మీదబాప్టిజం ఇచ్చినట్టు వెల్లడించిన హెలెన్ రాడ్కీ సైతం ఒకప్పుడు మోర్మనే. అనంతరకాలంలో ఆమె చర్చ్ నుంచి వెలికి గురయ్యారు. 'ది డైరీ ఆఫ్ ఏన్ ప్రాంక్' రాసిన యూదు చిన్నారి ఏన్ఫ్రాంక్కు కూడా ఎల్డీఎస్ ఇలాగే మరణానంతరం బాప్టిజం ఇచ్చినట్టు గతంలో వెల్లడించి సంచలనం సృష్టించిన చరిత్ర రాడ్కీకి ఉంది. ఇదే కోవలో గాంధీజీకి కూడా లేటర్డే సెయింట్స్ చర్చ్ బాప్టిజం ఇచ్చినట్టు నెవడాలోని హిందూ కార్యకర్త రాజన్ జెడ్కు ఆమె ఒక ఈమెయిల్ పంపారు. గాంధీజీ పేరు మీద బాప్టిజం ఇచ్చినట్టుగా ఉన్న రికార్డును తాను ఫిబ్రవరి 16న చూసినట్టు అందులో పేర్కొన్నారు. అయితే తాను చూసిన కొద్ది రోజులకే ఆ రికార్డును మాయం చేశారని, అదిప్పుడు దొరికే అవకాశం లేదని వెల్లడించారు.
ఇలా ఒక రికార్డు మాయమవడం అసాధారణమైన విషయమని తన మెయిల్లో పేర్కొన్నారు. ఈ విషయం ఇతరులకు తెలియకూడదన్నది మోర్మన్ల ఉద్దేశంగా భావిస్తున్నానన్నారు. కాగా ఈ విషయం తెలిసి మహాత్ముడి మనుమడు అరుణ్ గాంధీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. హిందువులుగానీ, ఇతర మతస్థులెవరైనాగానీ మతమార్పిడికి పాల్పడటాన్ని తన తాతయ్య పూర్తిగా వ్యతిరేకించేవారని అరుణ్ అన్నారు. గాంధీజీ అన్ని మతాలనూ గౌరవించేవారని, ఏ మతాన్ని అనుసరించాలన్నది వ్యక్తులు స్వయంగా నిర్ణయించుకోవాలని, ఇతరులు వారిని బలవంతం చేయకూడదని భావించేవారని అరుణ్గాంధీ వివరించారు. హిందూమతం పట్ల ప్రగాఢ విశ్వసం ఉన్న మహాత్ముడి పేరు మీద ఆయన మరణానంతరం బాప్టిజం ఇవ్వడం ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాలను దెబ్బతీయడమేనని వాషింగ్టన్లోని హిందూ అమెరికా ఫౌండేషన్ మండిపడింది. మాన్సన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన మహాత్ముడికి బాప్టిజం ఇవ్వడం ద్వారా చర్చ్ లబ్ధి పొందాలని చూసినట్లుందని అభిప్రాయపడుతున్నారు.