కష్టమైనా నో ఇంగ్లీష్: దోతీతో ఆకట్టుకున్న సిఎం

Kiran Kumar Reddy
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గురువారం సంప్రదాయపరంగా దోతి కట్టుతో అందర్నీ ఆకట్టుకున్నారు. సాధారంగా ఆయన ఎప్పుడూ తెల్లటి లాల్చీ పైజామాతో కనిపిస్తారు. కానీ నిన్న మాత్రం పంచెకట్టుతో కనిపించారు. నాలుగో ప్రపంచ తెలుగు మహాసభలు నిన్న ప్రారంభమయ్యాయి. ప్రపంచ మహా సభల ప్రారంభోత్సవం అనంతరం కిరణ్ కుమార్ రెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భాలలో ఆయన దోతీతో కనిపించారు.

తెలుగు మహాసభల ప్రారంభోత్సవానికి ముందు కిరణ్ ఎపిఎస్ఆర్టీసి బస్టాండు ఎదుట తెలుగుతల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. లాల్చి పైజామాతో నిత్యం కనిపించి కిరణ్ తెలుగు మహాసభల నేపథ్యంలో సాంప్రదాయబద్దంగా ఉండాలని భావించారు. తెలుగుతల్లి విగ్రహం ఆవిష్కరణ సంబంధంగా ఆయన మాట్లాడేటప్పుడు తన ప్రసంగంలో ఇంగ్లీషు పదాలు దొర్లకుండా పూర్తిగా తెలుగులోనే మాట్లాడే ప్రయత్నాలు చేశారు.

తెలుగు తల్లి విగ్రహావిష్కరణ తర్వాత ఆయన అతను ప్రత్యేక పూజలు చేశారు. జై తెలుగు తల్లి అంటూ నినాదాలు చేశారు. తెలుగు తల్లి సెంటర్ వద్ద ఆయన మహా జన యాత్రను జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీలో రచయితలు, తెలుగు ప్రేమికులు... దాదాపు రెండు వేలకు పైగా పాల్గొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+