వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షర్మిల, బాబులకు రోజుకు లక్షల్లో ఖర్చు!

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu - Sharmila
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు 'వస్తున్నా మీకోసం', వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి షర్మిల 'మరో ప్రజా ప్రస్థానం' పాదయాత్రలకు రోజుకు లక్షల్లో ఖర్చవుతోందట. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు పాదయాత్ర కొనసాగుతుండగా.. కీ హోల్ ఆపరేషన్ కారణంగా షర్మిల పాదయాత్రకు మూడు వారాలు బ్రేక్ పడింది.

చంద్రబాబు, షర్మిలలతో పాటు పాదయాత్రలో పాల్గొనే వారి పైన, సౌకర్యాల కోసం, ప్రచార సాధనాల కోసం.. ఇలా ఒక్కో రోజుకు లక్షల రూపాయలు ఖర్చవుతున్నాయట. టీవీలలో వార్తల ప్రచారం కోసం ఆయా పార్టీలు ఛానల్స్‌కు ఇంత అని ముట్టజెప్పుతున్నట్లుగా కూడా ఆరోపణలు వస్తున్నాయి. ఇవన్నింటిని కలుపుకొని నేతల పాదయాత్రలకు రోజుకు లక్షల చోప్పున ఖర్చవుతోందట. చంద్రబాబు జెడ్ క్యాటగిరీ నేత.

ఇతను ఇప్పటికే 1,200 పాదయాత్రను పూర్తి చేసుకున్నారు. బాబు మొత్తం 117 రోజులు 2,300 కిలోమీటర్ల పాదయాత్ర చేయనున్నారు. అక్టోబర్ 2వ తేదిన ప్రారంభమైన పాదయాత్ర జనవరి 26న ముగియనుంది. అవసరమైతే పొడిగించే అవకాశాలు కూడా ఉన్నాయి. మరోవైపు షర్మిల అక్టోబర్ 18న ఇడుపులపాయలో పాదయాత్రను ప్రారంభించారు. ఈమె ఆరు నెలలు మూడు వేల కిలోమీటర్లు ఈ పాదయాత్ర చేయనున్నారు. ఇటీవల ఆపరేషన్ కారణంగా బ్రేక్ వచ్చింది. తిరిగి మళ్లీ త్వరలో ప్రారంభిస్తారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.

అయితే ఖచ్చితంగా కాకపోయినా బాబు పాదయాత్రకు రోజుకు లక్షా డెబ్బై వేల రూపాయల వరకు ఖర్చవుతున్నాయట. దాదాపు మూడు వందల మంది భోజనానికి దాదాపు రూ.60 వేలు అవుతుందట. మరో పదివేలు ఫలహారంకు ఖర్చవుతోందట. బాబు బస్సులో యాత్ర చేస్తున్నారు. బస్సుకు, జీపులు, షామియానా కోసం ట్రక్కు... ఇలా అన్నింటిని కలుపుకొని లక్షల రూపాయల ఖర్చు రోజుకు అవుతోందట.

బాబు పాదయాత్రలో ఆయన వచ్చే కంటే ముందే ఆయన వచ్చే దారిలో నీళ్లు కూడా చల్లుతున్నట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. 50 పోలీసులు, 50 వాలంటీర్లు యాత్రలో ఉంటున్నారు. అయితే చంద్రబాబు యాత్ర కంటే షర్మిల పాదయాత్రకే ఎక్కువ ఖర్చవుతుందని టిడిపి నేతలు ఆరోపిస్తున్నారట. షర్మిల యాత్రకు రోజుకు రూ.10 లక్షల వరకు ఖర్చవుతుందని టిడిపి నేతలు అభిప్రాయపడుతున్నారు.

అయితే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మాత్రం షర్మిల యాత్రకు తాము రోజుకు లక్ష రూపాయలు మాత్రమే ఖర్చు చేస్తున్నామని చెబుతున్నారట. షర్మిల పాదయాత్రకు అందరూ తమ తమ సొంత ఖర్చులతో వస్తున్నారని... తాము కేవలం పలువురికి ఫుడ్ మాత్రమే అరేంజ్ చేస్తున్నామని, తమకు రోజుకు లక్షకు మించడం లేదని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు చెబుతున్నట్లుగా తెలుస్తోంది.

English summary
TDP chief Nara Chandrababu Naidu and YSR Congress party leader Sharmila's padayatras are not simple affairs. Lakshs of Rupees are spent daily.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X