ఓటింగుకు ఎంపిల డుమ్మా: చంద్రబాబు టార్గెట్
మరోవైపు, చంద్రబాబు శుక్రవారం ఆ విషయంపై మీడియా ప్రతినిధులు ప్రశ్నిస్తే జవాబు దాటేశారు. దానిపై ఆదిలాబాద్ జిల్లా తరోడాలో మీడియా ప్రతినిధులు చంద్రబాబును ప్రశ్నించారు. దానిపై తర్వాత చెప్తానంటూ సమాధానం ఇవ్వడానికి నిరాకరించారు. భెైంసాలో కూడా ఆయన ఆ ప్రశ్న ఎదురైంది. ఇక్కడ కూడా ఆయన ఏ సమాధానం ఇవ్వలేదు. ఈ సమాధానం ఇవ్వకపోవడం వెనక మతలబు ఏమిటనేది వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్కు చెందిన మీడియా వేస్తున్న ప్రశ్న.
ముగ్గురు పార్లమెంటు సభ్యుల గైర్హాజరుతో చంద్రబాబు ఇరకాటంలో పడినట్లే చెప్పాలి. గైర్హాజరీకి ముగ్గురు పార్లమెంటు సభ్యులు చెబుతున్న సమాధానాలు కూడా నమ్మశక్యం కాకుండా ఉన్నాయని అంటున్నారు. చంద్రబాబు వెనక ఉండి నాటకం నడిపారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు విమర్శిస్తున్నారు. కాంగ్రెసు ప్రభుత్వాన్ని కాపాడడానికి జరిగిన ఒప్పందంలో భాగంగానే చంద్రబాబు సూచన మేరకు వారు వ్యవహరించారనేది ఆ పార్టీ ప్రధాన ఆరోపణ.
రాజ్యసభకు డుమ్మా కొట్టిన దేవేందర్ గౌడ్, సుజనా చౌదరి, గుండు సుధారాణి ముగ్గురు కూడా చంద్రబాబు మాటను జవదాటేవారు కాదు. తనకు వారు అత్యంత సన్నిహితులు కావడం కూడా చంద్రబాబు తలకు ఆ పీడ చుట్టుకుందని అంటున్నారు.