యూత్ను చూసి: జగన్పై బాబు మొబైల్ వార్
జగన్ అవినీతి గురించి ఒక్కొక్కరు పది వరకు ఎస్సెమ్మెస్లు చేయాలని సూచించారు. చంద్రబాబు తన పాదయాత్రలో జగన్, కాంగ్రెసు అవినీతి పైన తీవ్రస్థాయిలో విరుచుకు పడుతున్నారు. అవినీతిలో తల్లి కాంగ్రెసు, పిల్ల కాంగ్రెసు అని బాబు ధ్వజమెత్తుతున్నారు. జగన్ అవినీతిని ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు బాబు వివిధ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా మొబైల్ వార్కు తెరతీశారు.
పాదయాత్రలో బాబు ఆ రెండు పార్టీలపై నిప్పులు చెరిగుతున్నారు. కాంగ్రెస్, వైయస్సార్ కాంగ్రెసు ఒకే తానులో ముక్కలని ఆయన మండిపడుతున్నారు. అభివృద్ధి అంటే నై అవినీతి అంటే సై అనడమే ఈ పార్టీల సిద్ధాంతమని దుయ్యబడుతున్నారు. జగన్ను జైలులో కలుసుకుని ఆ పార్టీలో చేరుతున్నవారికి నీతిలేదని విమర్శిస్తున్నారు. అక్రమంగా సంపాదించిన డబ్బులతో జగన్ ఎమ్మెల్యేలను కొంటున్నారని ఆరోపిస్తున్నారు.
నాయకులు అమ్ముడుపోయినా కార్యకర్తలు అమ్ముడు పోవడం లేదని, వారే పార్టీకి శక్తి అని ప్రశంసించారు. శనివారం ఆయన మాట్లాడుతుండగా.. కొంతమంది యువకులు మొబైల్లో మాట్లాడటం కనిపించింది. దీంతో బాబుకు కొత్త ప్లాన్ వచ్చింది. తమ్ముళ్లూ.. అందరి దగ్గరా సెల్ఫోన్లు ఉన్నాయి. వాటితో కూడా మీరు అవినీతిపై పోరాటం చేయొచ్చునని సూచించారు. జగన్కు వ్యతిరేకంగా ఒక్కొక్కరికి పది ఎస్సెమ్మెస్లు పెట్టండన్నారు. గతంలో జగన్ డబ్బుపై మూటలు, బండ్లు అంటూ లెక్కలు చేప్పిన విషయం తెలిసిందే.