మక్బూల్ రిలీజ్: వైయస్ మిస్, రోశయ్య సంతకం?
ఇక అప్పుడో, ఇప్పుడో ఫైలుపై సంతకం చేయాల్సి ఉండింది. ఇంతలో ఆయన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి అయిన రోశయ్య ఈ ఫైలుపై సంతకం పెట్టారు. దాంతో 2009 అక్టోబర్ 2న గాంధీ జయంతి రోజున సత్ప్రవర్తన కలిగిన ఖైదీలతోపాటు మఖ్బూల్, ఖాసీం కూడా విడుదలయ్యారు.
మూడు హత్యలు, రెండు పేలుళ్ల కేసుల్లో నిందితుడిగా ఉన్న మక్బూల్ ఒక హత్యకేసులో చర్లపల్లి జైలులో యావజ్జీవ ఖైదీగా ఉన్నాడు. దాదాపు పదేళ్లపాటు ఇదే జైలులో గడిపాడు. మఖ్బూల్తోపాటు అతని స్నేహితుడు ఖాసీంబేగ్కు కూడా హత్యకేసులో శిక్ష పడింది. వీరిని మంజీర బ్యారక్లోని (అప్పట్లో పాపాగ్ని అని పిలిచేవారు) ఐఎస్ఐ ఉగ్రవాద విచారణ ఖైదీలతోపాటు సింగిల్ సెల్స్లో ఉంచారు.
భోజనం, వైద్యం, ములాఖత్ తదితరాల విషయంలో ఉగ్రవాద విచారణ ఖైదీలు తరచూ సిబ్బందితో వాగ్యుద్ధానికి దిగేవారు. మఖ్బూల్, ఖాసీం మాత్రం ఇలాంటి వివాదాల జోలికి వెళ్లేవారు కారు. దీంతో వీరి 'సత్పవర్తన' అధికారులకు ఎంతగానో నచ్చింది. పైకి మంచిగా కనిపిస్తూనే మక్బూల్ ఉగ్రవాద విచారణ ఖైదీలను రెచ్చగొట్టేవారట..