తెలంగాణ సిఎం జానారెడ్డా, దామోదరనా?

నలుగురు ముఖ్య నేతలు ఎస్ జైపాల్రెడ్డి, జానారెడ్డి, డి.శ్రీనివాస్, దామోదర రాజనర్సింహ కొత్త రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడానికి పోటీ పడుతున్నట్లు వినికిడి. వీరిలో జానా రెడ్డి ముందు వరుసలో ఉన్నట్లు చెబుతున్నారు. జైపాల్ రెడ్డి కూడా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిపై మక్కువ పెంచుకున్నట్లు చెబుతున్నారు. ఒకవేళ జైపాల్ రెడ్డికి అవకాశం వస్తే జానా రెడ్డి పక్కకు తప్పుకోవచ్చునని అంటున్నారు.
రాష్ట్ర విభజన విషయంలో చివరి నిమిషంలో ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ కీలకంగా మారారు. దళిత నేతగా, ఉప ముఖ్యమంత్రిగా, తెలంగాణ కోసం ప్రయత్నాలు చేసిన ముఖ్య నేతల్లో ఒకరిగా తనకు అవకాశం వస్తుందని దామోదర రాజనర్సింహ నమ్ముతున్నారు. పిసిసి మాజీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ పేరు కూడా ప్రముఖంగానే వినిపిస్తోంది. అధిష్టానానికి అత్యంత విశ్వాస పాత్రుడైన డి. శ్రీనివాస్ పేరు పరిగణనలోకి రావచ్చునని అంటున్నారు. బిసి వర్గానికి చెందిన నేత కావడం డి. శ్రీనివాస్కు కలిసి వచ్చే విషయమని అంటున్నారు.
ఎస్ జైపాల్ రెడ్డిని ముందుకు తెస్తే అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుందని భావిస్తున్నారు. తెలంగాణకు చెందిన నాయకులు ఆయన పేరును వ్యతిరేకించబోరని, దానివల్ల అంతర్గత విభేదాలు పొడసూపవని అంటున్నారు. జానా రెడ్డిని ముందుకు తెస్తే దళిత, బిసీ నేతలు వ్యతిరేకించే అవకాశాలు లేకపోలేదు. జైపాల్ రెడ్డికి ఆ సమస్య ఉండదు. అదే సమయంలో జానారెడ్డి కూడా సర్దుకుపోతారు.












Click it and Unblock the Notifications