విభజన: కిరణ్ రెడ్డి 'అమ్మ' భక్తుడే, మౌనమే
కాగా, అన్ని విషయాలపైనా ముఖ్యమంత్రి సమాధానం చెప్పకుండా మౌనంగా వ్యవహరిస్తున్నారు. రాజకీయ పార్టీ పెడతారనే పుకార్లపై ఆయన అవునని గానీ కాదని గానీ సమాధానం చెప్పడం లేదు. మంగళవారం తనను కలిసిన కొంత మంది కలిసినప్పుడు అడిగితే ఆయన ఏమీ మాట్లాడలేదట.
వచ్చే ఎన్నికల వరకు ముఖ్యమంత్రిగా కొనసాగాలని కాంగ్రెసు అధిష్టానం తనకు నిర్దేశించిందని, లేనిపక్షంలో ఎప్పుడో మార్చి ఉండేదని కిరణ్ కుమార్ రెడ్డి అన్నారట. మాజీ మంత్రులు జెసి దివాకర్ రెడ్డి, కె. సత్యనారాయణ రాజు, మంత్రి డొక్కా మాణిక్యవర ప్రసాద్, పార్లమెంటు సభ్యుడు సాయిప్రతాప్ తదితరులు ఆయనను మంగళవారంనాడు కలిశారు. తమ రాజకీయ భవిష్యత్తుపై తాము ఏ నిర్ణయమూ తీసుకోలేకపోతున్నామని, ఇందుకు సంబంధించి మార్గదర్శకత్వం వహించాలని వారు కిరణ్ కుమార్ రెడ్డితో అన్నట్లు తెలుస్తోంది.
మీరు రాజకీయ పార్టీ పెడితే, తాము తమ నిర్ణయం తీసుకుంటామని అని జెసి దివాకర్ రెడ్డి ముఖ్యమంత్రితో అన్నట్లు సమాచారం. అయితే, ముఖ్యమంత్రి నేరుగా సమాధానం ఇవ్వలేదని చెబుతున్నారు. తనను కొంత మంది అధిష్టానం కోవర్టునని, తాను రాజకీయ పార్టీ పెడుతున్నానని మరి కొందరు, తాను సర్వేలు నిర్వహిస్తున్నానని తాజా కొంత మంది అంటున్నారని కిరణ్ కుమార్ రెడ్డి వారితో అన్నారట. అంతేగానీ, ఏ విషయమూ స్పష్టంగా చెప్పలేదని అంటున్నారు.