బీజేపీ అభ్యర్థికి 2,000 మంది కూతుర్ల ప్రచారం!
ముంబై: మహారాష్ట్ర ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరఫున షోలాపూర్ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్న సుభాష్ దేశ్ముఖ్ తరఫున రెండువేల మంది కూతుళ్లు, మరో రెండువేల మంది అల్లుళ్లు ప్రచారం చేస్తున్నారు! సుభాష్ గతంలో పార్లమెంటు సభ్యుడిగా పని చేశారు. అయితే, ఈసారి ఎమ్మెల్యేగా బరిలోకి దిగుతున్నారు.
సుభాష్ దేశ్ముఖ్ గత ఏడేళ్లుగా పేద కుటుంబాలను ఆదుకోవడం కోసం ఏటా సామూహిక వివాహాలు జరిపిస్తున్నారు. పెళ్లిళ్లు చేయడంతో పాటు నవ దంపతుల కాపురానికి అవసరమైన సామాగ్రిని కూడా అతడే అందిస్తున్నారు. అంతేకాకుండా వారికి ఆడపిల్ల పుడితే ఆమె పేరున రూ.5 వేలు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తున్నారు.

ఇలా ఆయన రెండువేల మంది యువతులకు వివాహం జరిపించారు. ఆ యువతులు సుభాష్ దేశ్ముఖ్ను పితృసమానుడిగా చూస్తుంటారు. ఇప్పుడు ఎన్నికల నేపథ్యంలో ఆ యువతులు, వారి భర్తలు సుభాష్ తరఫున ప్రచారం చేస్తున్నారు.
ఎందరో రైతులు, పేదవారు.. తమ కూతుళ్లకు పెళ్లిళ్లు చేసేందుకు భూమి అమ్ముకోవడం చూసి తాను.. అలాంటి వారిని ఆదుకునేందుకే పెళ్లి చేశానని, ఇప్పుడు వారు అంతా తనకు మద్దతుగా ప్రచారం చేయడం సంతోషంగా ఉందని సుభాష్ దేశ్ముఖ్ చెబుతున్నారు.
-
కొత్త పెన్షన్ల కోసం భారీగా దరఖాస్తులు, దక్కేది వీరికే - తాజా నిర్ణయం..!! -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
హనుమ జయంతి వేళ చిరంజీవి ఇంట్లో అరుదైన అపురూప దృశ్యం..!! -
మందు బాబుల పండుగ, ఫుల్లు కిక్కు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
అర్థరాత్రి మీటింగ్.. తెల్లవారేసరికి సీన్ రివర్స్! రష్యాతో భారత్ కొత్త వ్యూహం -
అమరావతి బిల్లు పై బీఆర్ఎస్ అనూహ్య ట్విస్ట్..!! -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం- లేటెస్ట్ లెక్కలు -
1997 నాటి సంక్షోభం నీడలో రూపాయి. చరిత్ర పునరావృతం అవుతుందా? -
నియోజకవర్గాల పెంపు వేళ బిగ్ ట్విస్ట్, ఎవరికి అనుకూలం..!! -
ఫ్లాప్ రికార్డులన్నీ బ్రేక్ చేసిన హీరో అతనే.. రూ.45 కోట్లతో బడ్జెట్ - రూ. 60 వేలు కలెక్షన్స్ !












Click it and Unblock the Notifications