బీజేపీ అభ్యర్థికి 2,000 మంది కూతుర్ల ప్రచారం!
ముంబై: మహారాష్ట్ర ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరఫున షోలాపూర్ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్న సుభాష్ దేశ్ముఖ్ తరఫున రెండువేల మంది కూతుళ్లు, మరో రెండువేల మంది అల్లుళ్లు ప్రచారం చేస్తున్నారు! సుభాష్ గతంలో పార్లమెంటు సభ్యుడిగా పని చేశారు. అయితే, ఈసారి ఎమ్మెల్యేగా బరిలోకి దిగుతున్నారు.
సుభాష్ దేశ్ముఖ్ గత ఏడేళ్లుగా పేద కుటుంబాలను ఆదుకోవడం కోసం ఏటా సామూహిక వివాహాలు జరిపిస్తున్నారు. పెళ్లిళ్లు చేయడంతో పాటు నవ దంపతుల కాపురానికి అవసరమైన సామాగ్రిని కూడా అతడే అందిస్తున్నారు. అంతేకాకుండా వారికి ఆడపిల్ల పుడితే ఆమె పేరున రూ.5 వేలు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తున్నారు.

ఇలా ఆయన రెండువేల మంది యువతులకు వివాహం జరిపించారు. ఆ యువతులు సుభాష్ దేశ్ముఖ్ను పితృసమానుడిగా చూస్తుంటారు. ఇప్పుడు ఎన్నికల నేపథ్యంలో ఆ యువతులు, వారి భర్తలు సుభాష్ తరఫున ప్రచారం చేస్తున్నారు.
ఎందరో రైతులు, పేదవారు.. తమ కూతుళ్లకు పెళ్లిళ్లు చేసేందుకు భూమి అమ్ముకోవడం చూసి తాను.. అలాంటి వారిని ఆదుకునేందుకే పెళ్లి చేశానని, ఇప్పుడు వారు అంతా తనకు మద్దతుగా ప్రచారం చేయడం సంతోషంగా ఉందని సుభాష్ దేశ్ముఖ్ చెబుతున్నారు.
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications