ఓటేసి కారు గెలిచిన మహిళ: మరికొందరూ..

100శాతం ఓట్లు నమోదైన గ్రామాల్లోని ఓటర్ల నుంచి లక్కీ డ్రా తీసి బహుమతులు అందజేస్తామన్న ప్రచారంతో జిల్లాలో గణనీయంగా 76.84 శాతం పోలింగ్ నమోదైంది. ఏప్రిల్ 30న ఎన్నికల్లో 95శాతం పోలింగ్ నమోదైన గ్రామాలకు కలెక్టరేట్లో గురువారం డ్రా తీశారు. సిద్దపేట నియోజకవర్గంలోని 145వ పోలింగ్ స్టేషన్లో ఓటు వేసిన పరుస లచ్చవ్వకు నానోకారు గెలుచుకున్నారు.
నర్సాపూర్ నియోజకవర్గంలోని పల్పానూర్కి చెందిన పిట్ల శ్రవణ్కు ద్వితీయ బహుమతిగా హీరో హోండా బైక్, శివంపేట మండలం పరికి బండ్లకి చెందిన చుక్కా నారాయణ మూడో బహుమతిగా ఎల్ఈడి టీవీ గెలుచుకున్నారు. గజ్వేల్ నియోజకవర్గంలోని గిరిపల్లి ఓటరు పోసాని నరేష్ వ్యవసాయ పంపుసెట్, పటాన్చెరు నియోజకవర్గం పుట్టుగూడకి చెందిన పి శ్రీనివాస్ యాదవ్ 220 లీటర్ల కెపాసిటీ గల రిఫ్రీజిరేటర్ గెలుచుకున్నారు.
92శాతం పోలింగ్ సాధించిన గ్రామాల్లో ఓటర్లకు 220 సెల్ఫోన్లు, 410 మంది ఓటర్లకు గృహోపకరణాలు, 460 సీలింగ్ ఫ్యాన్లు, 60 హాట్ బాక్సులు, 20 మందికి ఓటర్లకు బ్రీఫ్కేస్లను మే 17న కలెక్టరేట్లో కలెక్టర్ స్మితా సబర్వాల్ అందజేయనున్నారు. 92శాతం పోలింగ్ దాటిని గ్రామాలకు రూ. 2లక్షల అభివృద్ధి ప్యాకేజీని కలెక్టర్ ప్రకటించిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications