జగన్ పార్టీ మహిళా నేత చెప్పు దాడి (పికర్స్)
కరీంనగర్: కరీంనగర్ జిల్లా వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో విభేదాలు రచ్చకెక్కాయి. జెండా పండుగ సాక్షిగా విభేదాలు వీధీకెక్కాయి. స్వాతంత్ర్య దినోత్సవ వేడుక సందర్భంగా శుక్రవారం వైయస్సార్ కాంగ్రెసు కార్యాలయం వద్ద పార్టీ జిల్లా అధ్యక్షుడు సింగిరెడ్డి భాస్కర్ రెడ్డి పతాకావిష్కరణ చేశారు.
జాతీయ గీతాలాపన పూర్తి కాగానే ఆ పార్టీ మహిళా విభాగం నాయకురాలు గంటా సుశీల సింగిరెడ్డి భాస్కర్ రెడ్డి అకస్మాత్తుగా చెప్పుతో దాడి చేశారు. దీంతో కంగు తిన్న భాస్కర్ రెడ్డి ఆమెను నెట్టివేస్తుండగా, మరో వైపు నుంచి ఆణె భర్త సతీష్ కూడా ఆయనపై దాడి చేశారు.
మిగతా నాయకులు వారిస్తున్నా ఆమె పదేపదే భాస్కర్ రెడ్డిపై చెప్పుతో కొట్టారు. పార్టీ కార్యక్రమాలను ఏకపక్షంగా నిర్వహిస్తున్నారని, తనకు సమాచారం ఇవ్వడం లేదని సుశీల భాస్కర్ రెడ్డిపై విమర్శలు చేశారు. భాస్కర్ రెడ్డి కుటుంబ సభ్యులపై కూడా ఆమె విమర్శలు చేశారు.
చెప్పుతో దాడి
కరీంనగర్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మహిళా విభాగం నాయకురాలు గంటా సుశీల పార్టీ జిల్లా అధ్యక్షుడు సింగిరెడ్డి భాస్కర్ రెడ్డిపై చెప్పుతో దాడి చేశారు.
జెండా వందనం సాక్షిగా...
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కరీంనగర్ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యాలయంలో విభేదాలు రచ్చకెక్కాయి. మహిళా నేత జిల్లా అధ్యక్షుడిపై దాడి చేశారు.
పదే పదే దాడి...
సింగిరెడ్డి భాస్కర్ రెడ్డిపై గంటా సుశీల ఇతర నాయకులు వారిస్తున్నా వినకుండా పదే పదే చెప్పుతో దాడి చేశారు. మరోవైపు నుంచి సుశీల భర్త సతీష్ ఆయనపై దాడి చేశారు.
జగన్ పిలుపు
ఘర్షణ గురించి తెలుసుకున్న పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ సింగిరెడ్డి భాస్కర్ రెడ్డిని హైదరాబాద్ రావాలని పిలిచారు. దాంతో ఆయన హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు.