ముగ్గురు పిల్లలు దావూద్ వేటకు వెళ్లారు
బీహార్లోని పాట్నాలో గల సెయింట్ మైఖైల్ హైస్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతున్న ముగ్గురు పిల్లు భారత భద్రతా సంస్థలు చేయలేని పనిని తాము చేయాలని అనుకున్నారు. దావూద్ ఇబ్రహీంను పట్టుకోవడానికి ఇంట్లో చెప్పకుండా వెళ్లిపోయారు.
ఆ పిల్లలు శుక్రవారంనాడు కనిపించకుండా పోయారు. దాంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు వారి ఫోన్లపై నిఘా వేశారు. వారు ఢిల్లీలో ఉన్నట్లు పోలీసులు కనిపెట్టారు. ఢిల్లీ పోలీసుల సహకారంతో పోలీసులు ముగ్గురిలో ఓ బాలుడిని పట్టుకోగలిగారు. ఆదివారంనాడు ముగ్గురు పిల్లలను పాట్నాకు తీసుకుని వచ్చారు. పోలీసుల విచారణలో ఆ బాలుడు అసలు విషయం చెప్పాడు.
తమకు చదువుపై ఇష్టం లేదని, దీంతో దావూద్ను పట్టుకోవడానికి వెళ్లామని ఆ బాలుడు చెప్పినట్లు పాట్నా ఎస్ఎస్పి మను మహరాజ్ చెప్పారు. దావూద్ను పట్టుకుని భారత్కు అప్పగిస్తే తమకు కోట్లాది రూపాయలు రివార్డుగా దక్కుతాయని, దాంతో వినోదించవచ్చునని భావించామని ఆ బాలుడు చెప్పాడు.
ముగ్గురు బాలురు కూడా పాట్నాకు వంద కిలోమీటర్ల దూరంలో గల మోకామాకు చేరుకున్నారని, అక్కడి నుంచి కోల్కతా వెళ్లారని పోలీసులు చెప్పారు. అక్కడి నుంచి ఢిల్లీకి చేరుకున్నారని చెప్పారు. ఢిల్లీలో వారు పోలీసులకు చిక్కారు.