రేవంత్ది తేలాకే తేల్చుతాం: టీడీపీకి బీజేపీ 'గ్రేటర్' షాక్
హైదరాబాద్: రేవంత్ రెడ్డి వ్యవహారంలో నేపథ్యంలో తెలుగుదేశం పార్టీతో పొత్తు పైన తెలంగాణ భారతీయ జనతా పార్టీ మెలిక పెట్టింది! రేవంత్ ఓటుకు నోటు కేసులో తప్పొప్పులు తేలాకే టీడీపీతో పొత్తు కొనసాగించాలా? వద్దా? అన్న అంశంపై నిర్ణయం తీసుకుంటామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.
ఓటుకు నోటు కేసు విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. అయితే ఈ కేసుకు సంబంధించి పత్రికా క్లిప్పింగులు, ఇతర వివరాలతో నివేదికను కేంద్రానికి పంపించామన్నారు. బీజేపీ నైతిక విలువలతో కూడుకున్న పార్టీ అని, రాజకీయాల్లోనూ నైతిక విలువలు పెరగాలని కోరుకుంటుందన్నారు.
అయితే నోటుకు ఓటు కేసును ఏసీబీ పరిశోధిస్తున్నదని, ప్రస్తుతం ఇది న్యాయస్థానంలో ఉందని, అక్కడ తప్పో ఒప్పో తేలాక టీడీపీతో పొత్తుపై ఆలోచిస్తామని చెప్పారు.

కాగా, త్వరలో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు జరగనున్నాయి. టీడీపీతో పొత్తును తెలంగాణ బీజేపీ మొదటి నుండి వ్యతిరేకిస్తోంది. ఇప్పుడు కూడా బీజేపీకి టీడీపీతో పొత్తు ఇష్టం లేదు. గ్రేటర్ ఎన్నికల్లో తెరాసకు ధీటుగా నిలవాలంటే ఒంటరిగా వెళ్లాలని భావిస్తోంది.
ఈ సమయంలో రేవంత్ రెడ్డి ఇష్యూ తెలంగాణ బీజేపీకి అందివచ్చిన అంశంగా కనిపిస్తోంది. ఎప్పటి నుండి టీడీపీకి దూరంగా ఉందామనుకుంటున్న తెలంగాణ తెలుగుదేశం ఈ అంశంతో ఆ పార్టీకి దూరం జరిగే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. అయితే, అధిష్టానాన్ని ఏమేరకు ఒప్పిస్తారో చూడాల్సి ఉంది.
-
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
"గోధుమ రవ్వ ఉప్మా" ఇలా చేస్తే ఇంటిల్లిపాది లొట్టలేయాల్సిందే..! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే












Click it and Unblock the Notifications