ఫేస్బుక్ పేజీ: చంద్రబాబు, పవన్ కళ్యాణ్ టార్గెట్
విజయవాడ: నోటుకు ఓటు కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని సవాల్ చేస్తూ ఓ గ్రూప్ నెటిజన్స్ మనవాళ్లు బ్రీఫ్డ్ మీ అంటూ ఫేస్బుక్లో పేజీని ప్రారంభించారు. ఈ ప్రచారానికి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గానీ, తెలుగుదేశం పార్టీ నాయకులు గానీ తమపై కేసు వేయవచ్చునని నెటిజన్లు సవాల్ చేశారు.
నోటుకు ఓటు కేసులో చంద్రబాబు తెలంగాణ నామినేటెడ్ శాసనసభ్యుడు సంభాషించినట్లు చెబుతున్న ఆడియో టేప్ విడుదలైన తర్వాత ఫేస్బుక్లో ఆ పేజీ ప్రారంభమైంది. నోటుకు ఓటు కేసుకు సంబంధించి అప్పటి నుంచి వందలాది పోస్టులు పోస్టయ్యాయి. చాలా మంది చంద్రబాబు వ్యాఖ్యలను అపహాస్యం చేస్తూ కామెంట్లు పోస్టు చేశారు.

మనవాళ్లు బ్రీఫ్ట్ మీ అనే పేజీకి అడ్మిన్ తానేనంటూ ప్లకార్డులు పట్టుకుని దిగిన ఏడు ఫొటోలను కూడా పోస్టు చేశారు. తనపై కేసు పెట్టవచ్చునని సవాల్ చేశారు. ఆ చిత్రాల్లో కనిపించినవారు తామే పేజీ అడ్మినిస్ట్రేర్లమంటూ ప్రకటించుకున్నారు.
అడ్మిన్లుగా చెబుకుంటూ పోస్టు చేసిన చిత్రాల్లో ఒక్కటి చేగొండి చంద్రశేఖర్ అనే వ్యక్తిది. ప్రొఫైల్ను బట్టి ఆయన ఫిల్మ్ డైరెక్టర్ అని తెలుస్తోంది. నోటుకు ఓటు కేసు తుది దశకు చేరుకునే వరకు ఈ పేజీని నడిపిస్తామని చెబుకున్నారు.
సోషల్ మీడియాలో చంద్రబాబుపై కామెంట్లు చేసినవారిపై చర్యలు తీసుకుంటామని తెలుగుదేశం పార్టీ నాయకులు హెచ్చరించిన తర్వాత ఈ పేజీ ప్రారంభమైంది. పవన్ కళ్యాణ్, తదితర టిడిపి నాయకులను అడ్మినిస్ట్రేర్లు టార్గెట్ చేసుకున్నారు. తాము తెలంగాణ మద్దతుదారులమని కూడా చెబుకున్నారు.












Click it and Unblock the Notifications