ఆకలేస్తే భార్యలను తినేయండి: ఫత్వా జారీ
న్యూఢిల్లీ: ఆకలేస్తే భార్యలను తినేయండంటూ ఓ ఫత్వా జారీ అయింది. భర్తకు అతిగా ఆకలేస్తే భార్యను తినవచ్చునని సౌదీ అరేబియాలో ఫత్వా జారీ అయింది. అబ్దుల్ అజీజ్ బిన్ అబ్దుల్లా ఈ ఫత్వా జారీ చేశాడు. ఈ ఫత్వా వినేవాళ్లు ముక్కున వేలేసుకునే విధంగా ఉంది. ఇదేమిటి తిక్క ఫత్వా అని గొణుక్కుంటున్నారు.
భార్యలు తమ భర్తల రుణం తీర్చుకునేందుకే ఈ ఫత్వా విడుదల చేశామని ఆయనగారు సెలవిస్తున్నాడు. ఆకలేస్తే ఆహారం తినాలి గానీ ఇలా భార్యను తినడమేంట్రాబాబూ అంటూ ప్రజల నుంచి వ్యతిరేకత వస్తోంది. మానవహక్కుల నుంచి కూడా విమర్శలు ఎదుర్కుంటోంది.

ప్రపంచవ్యాప్తంగా ఇదిప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఇదేకాదు, ఇలాంటి ఫత్వాలు తరుచూ జారీ అవుతూనే ఉంటాయి. ఆ మధ్య మహ్మద్ ది మెసెంజర్ ఆఫ్ గాడ్ అనే సినిమా తమ మతాన్ని కించపరిచేలా ఉందని, ఆ చిత్రానికి సంగీత దర్శకత్వం వహించడం సబబు కాదని ఏఆర్ రెహమాన్కు కూడా ఫత్వా జారీ చేశారు. మరో సందర్భంలో చర్చిలను కూలదోయండంటూ కూడా ఫత్వా జారీ చేసి సౌదీ ప్రభుత్వం వార్తల్లోకెక్కింది!
అత్యంత సంక్షోభ సమయంలో భార్య శరీర భాగాలను భర్త తినవచ్చునని ఆ ఫత్వా తెలియజేస్తోంది. అయితే, ఈ ఫత్వాను సౌదీ అరేబియా గ్రాండ్ ముఫ్తీ షేక్ వ్యతిరేకిస్తున్నారు. దీన్ని నకిలీ ఫత్వాగా కూడా అభివర్ణిస్తున్నారు. ఈ ఫత్వా గురించి వ్యంగ్యాత్మకమైన కాలమ్ మొరాకో బ్లాగర్ ఇజ్రాఫెల్ ఆల్ - మఘ్రాబీలో తొలిసారి అచ్చయింది.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications