ధోనీకి రూ.20 కోట్లు టోపీ పెట్టిన ఆస్ట్రేలియా కంపెనీ
సిడ్నీ: భారత క్రికెట్ జట్టు వన్డే, ట్వంటీ 20 కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి ఓ ఆస్ట్రేలియా స్పోర్ట్స్ కంపెనీ రూ.20 కోట్ల మేర మోసం చేసింది. ధోనీ పలు బ్రాండ్లకు ప్రచారకర్తగా ఉన్న విషయం తెలిసిందే. ఈ ఎండార్సుమెంట్లతో అతను కోట్లాది రూపాయలు ఆర్జిస్తున్నాడు.
ఆస్ట్రేలియాకు చెందిన 'స్పార్టాన్ స్పోర్ట్స్' సంస్థ ధోనీని మోసం చేసింది. ఒప్పందాలను గౌరవించకుండా రూ.20 కోట్లకు పైగా ఎగనామం పెట్టింది. వివిధ రకాల క్రీడా పరికరాలను తయారు చేసే ఆ కంపెనీ ధోనీతో మూడేళ్ల పాటు బ్యాట్, స్పాన్సర్ షిప్ కింద రూ.13 కోట్ల విలువైన ఒప్పందం కుదుర్చుకుంది.

కానీ చెల్లింపులు చేయడంలో విఫలమైంది. రాయల్టీ తదితరాలు కలుపుకొని ఇవ్వాల్సిన సొమ్ము రూ.20 కోట్లకు చేరింది. ఈ ఒప్పందం 2013 డిసెంబర్లో జరిగింది. అయితే, ధోనీకి నాలుగుసార్లు మాత్రమే చెల్లింపులు చేశారని.. ఆయన వ్యవహారాలు చూసే రితీ స్పోర్ట్స్ తెలిపింది. చివరిసారిగా ఈ ఏడాది మార్చిలో చెల్లింపులు జరిపిందన్నారు. బకాయిల ఎగవేత పైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పింది.
-
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
"గోధుమ రవ్వ ఉప్మా" ఇలా చేస్తే ఇంటిల్లిపాది లొట్టలేయాల్సిందే..! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే












Click it and Unblock the Notifications