అదే జరిగితే ఎస్పీకి షాక్: బీజేపీలోకి ములాయం కోడలు!, యోగితో అందుకే టచ్లో!
రాజకీయాల్లో ఏదైనా సాధ్యమేనని, ఇప్పుడే తానేమి చెప్పలేనని అపర్ణయాదవ్ బదులిచ్చారు. దీంతో బీజేపీలో ఆమె చేరిక పట్ల అప్పుడే ఊహాగానాలు బయలుదేరాయి.
లక్నో: ములాయం వారసురాలిగా ఏకంగా సీఎం స్థానం పైనే గురిపెట్టిన అపర్ణయాదవ్.. ఆఖరికి ఎమ్మెల్యేగా కూడా గెలవలేక చతికిలపడ్డారు. అయితే తాజా పరిణామాలు చూస్తుంటే మాత్రం ఆమె బీజేపీకి దగ్గరవుతున్నారా? అన్న సంశయం తలెత్తుతోంది. ఇదే ప్రశ్న అపర్ణయాదవ్ ను అడిగితే.. సమయం వచ్చినప్పుడు చెబుతానంటూ ఆమె పేర్కొనడం కూడా ఈ అనుమానాలకు ఊతమిస్తోంది.
కాగా, శుక్రవారం నాడు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అపర్ణయాదవ్ నేతృత్వంలోని ఎన్జీవో నిర్వహిస్తున్న గోశాలను సందర్శించారు. ఈ సందర్బంగా వారి మధ్య పలు విషయాలకు చర్చకు వచ్చినట్లు చెబుతున్నారు. యోగి సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సైతం అపర్ణ యాదవ్ భర్త ప్రతీక్ తో కలిసి ఆయన్ను కలిశారు. ఆ సందర్బంగా దాదాపు 20ని. పాటు భేటీ అయ్యారు.

గతంలోను మోడీ పట్ల, బీజేపీ పట్ల అపర్ణయాదవ్ అభిమానం చాటుకోవడం కూడా అపర్ణయాదవ్ బీజేపీ చేరిక అంశం తెర పైకి రావడానికి కారణం. ఈ నేపథ్యంలోనే మీడియా ప్రతినిధులు ఇదే విషయంపై అపర్ణయాదవ్ ను ప్రశ్నించారు. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమేనని, ఇప్పుడే తానేమి చెప్పలేనని అపర్ణయాదవ్ బదులిచ్చారు. దీంతో బీజేపీలో ఆమె చేరిక పట్ల అప్పుడే ఊహాగానాలు బయలుదేరాయి. ఇదిలా ఉంటే, ఇటీవలి ఎన్నికల్లో లక్నో కంటోన్మెంట్ నుంచి పోటీ చేసిన అపర్ణయాదవ్ బీజేపీ అభ్యర్థి రీటా బహుగుణ చేతిలో ఓడిపోయారు.
-
తమిళనాడులో NDA సీట్ల పంపకాల్లో బిగ్ ట్విస్ట్, లేలెస్ట్ సర్వే ఎఫెక్ట్ - ఎవరికెన్ని..!! -
మందు బాబులకు బిగ్ షాక్.. 2 రోజులు వైన్స్ బంద్.. -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్!












Click it and Unblock the Notifications