బురద గుంట దాటేందుకు..: కెమెరాకు చిక్కి బుక్కైన ఎమ్మెల్యే
ఒడిశా మల్కన్గిరి బిజూ జనతా దళ్ (బిజెడి) ఎమ్మెల్యే మనస్ మడ్కామీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఆయన ఓ గ్రామంలో వెళ్తుండగా బురదను దాటేందుకు, ఆయన మద్దతుదారులు చేతులపై ఎత్తుకున్నారు.
భువనేశ్వర్: ఒడిశా మల్కన్గిరి బిజూ జనతా దళ్ (బిజెడి) ఎమ్మెల్యే మనస్ మడ్కామీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన ఓ గ్రామంలో వెళ్తుండగా బురదను దాటేందుకు, ఆయన మద్దతుదారులు చేతులపై ఎత్తుకున్నారు.
ఇది విమర్శలకు దారి తీసింది. జిల్లాలో అమలవుతున్న సంక్షేమ పథకాలను పర్యవేక్షించేందుకు ఓ ఎంపీ, ఎమ్మెల్యే నియోజకవర్గంలో పర్యటించారు. అప్పుడు గ్రామంలో కాలినడక వెళ్తుండగా బురద నీటి గుంట ఎదురైంది. అది దాటాల్సిన పరిస్థితి ఏర్పడింది.

అప్పుడు ఆయన మద్దతుదారులు అతనిని తమ భుజాలపై ఎత్తుకొని బురద గుంటను దాటించారు. అప్పుడు ఆయన తెల్లని దుస్తులు ధరించి ఉన్నారు. అదే సమయంలో ఎమ్మెల్యేతో పాటే ఉన్న ఎంపీ మాత్రం అలాగే నడుస్తూ వచ్చారు.
ఎమ్మెల్యేను కార్యకర్తలు ఎత్తుకున్న ఫొటో ఒకటి స్థానిక మీడియాలో రావడంతో ఈ ఘటన వివాదాస్పదంగా మారింది. అయితే ఎమ్మెల్యే మానస్ మాత్రం కార్యకర్తలకు తనపై ఉన్న ప్రేమ, అభిమానంతోనే ఎత్తుకున్నారని చెబుతూ తనను తాను సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు. తాను ఎవర్నీ బలవంత పెట్టలేదని, తనను అలా తీసుకెళ్తూ వారు ఎంతో ఉప్పొంగిపోయారనడం గమనార్హం.
-
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
చిన్నారి చీతాల గర్జన.. జ్వాలా ప్రసవంతో ఏడు దశాబ్దాల తర్వాత హఫ్ సెంచరీ -
చైనా, పాకిస్థాన్ కు ఊహించని గుడ్ న్యూస్ చెప్పిన భారత్.. -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు












Click it and Unblock the Notifications