తెలంగాణకు పన్ను చెల్లించాల్సిన శశికళ: నోటీసులు జారీ

అక్రమాస్తుల కేసులో సుప్రీంకోర్టు దోషిగా తేల్చిన అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి వీకే శశికళ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి పన్ను బకాయిలు చెల్లించాల్సివుంది.

చెన్నై/హైదరాబాద్: అక్రమాస్తుల కేసులో సుప్రీంకోర్టు దోషిగా తేల్చిన అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి వీకే శశికళ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి పన్ను బకాయిలు చెల్లించాల్సివుంది. సికింద్రాబాద్ పరిధిలోని మారేడ్ పల్లి, రాధిక కాలనీలో శశికళ పేరిట ఓ ఇల్లు ఉండగా, దానికి గత రెండేళ్ల నుంచి ఆస్తి పన్ను చెల్లించలేదు.

పన్ను బకాయిలను నూరు శాతం వసూలు చేయాలని సంకల్పించిన కేసీఆర్ సర్కారు, ఈ మేరకు శశికళ పేరిట నోటీసులు కూడా జారీ చేశారు. కాగా, ఈ ఇంటిని 1990 ప్రాంతంలో శశికళ కొనుగోలు చేశారు.

 Sasikala to pay tax to Telangana government

అప్పట్లో హైదరాబాద్ కు వచ్చినప్పుడు కొంతకాలం జయలలిత ఇదే ఇంట్లో బస చేసేవారని స్థానికులు చెబుతున్నారు. ఆపై ప్రైవేటు వ్యక్తులకు ఈ ఇంటిని అద్దెకు ఇచ్చినప్పటి నుంచి, వారు ఖాళీ చేసి వెళ్లిన తరువాత గత నాలుగేళ్లుగా ఈ ఇల్లు ఖాళీగానే ఉందని తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+