అమ్మాయిలకు శుభవార్తే!: ఫోన్ నంబర్ చెప్పకుండానే రీఛార్జ్ చేసుకోవచ్చు
వొడాఫోన్ సంస్థ తన కస్టమర్లు తమ మొబైల్ నెంబరు చెప్పక్కర్లే కుండానే రీఛార్జ్ చేసుకునే అవకాశాన్ని కల్పించనుంది.
హైదరాబాద్: సాధారణంగా షాపుల్లోకి వెళ్లి మొబైల్ రీచార్జ్ చేయించుకోవాలంటే ముందుగా మన నెంబరును చెప్పవలసి ఉంటుంది. ఆ తర్వాత వారు మనకు కావాల్సిన మొత్తం రీఛార్జ్ చేయడం జరుగుతుంది. అయితే, వొడాఫోన్ సంస్థ తన కస్టమర్లు తమ మొబైల్ నెంబరు చెప్పక్కర్లే కుండానే రీఛార్జ్ చేసుకునే అవకాశాన్ని కల్పించనుంది.
ఇటీవల ఓ రీఛార్జ్ షాపులో అమ్మాయిల ఫోన్ నంబర్లను వంద రూపాయల చొప్పున అమ్మేస్తూ ఓ వ్యక్తి పట్టుబడ్డ విషయం తెలిసిందే. తన వద్ద రీఛార్జ్ చేయించుకున్న అమ్మాయిల్లో అందంగా ఉన్న అమ్మాయిల ఫోన్ నెంబర్లను ఇంకా ఎక్కువ రేటుకే అమ్మేశాడు.

ఈ నేపథ్యంలోనే రిటైలర్కి నంబర్ చెప్పకుండానే రీఛార్జ్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది వొడాఫోన్. ఇందుకోసం వినియోగదారులు 12604 నంబర్కు 'Private' అని మెసేజ్ పంపాలని, వెంటనే వారి మొబైల్కి వన్ టైమ్ పాస్వర్డ్ (ఓటీపీ) వస్తుందని వొడాఫోన్ ప్రతినిధులు చెప్పారు.
ఆ ఓటీపీని రీటైలర్కి చెబితే చాలు.. రీఛార్జ్ చేయించుకోవచ్చు. ఇప్పటికే ఈ సర్వీసు పశ్చిమ బెంగాల్లో ప్రారంభం అయింది. కాగా, మిగితా టెలికాం సర్వీసులు కూడా ఇలాంటి సదుపాయాన్ని ప్రవేశ పెడితే బాగుంటుందని వినియోగదారులు కోరుతున్నారు.
-
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
తెలుగు హీరోయిన్తో స్టార్ క్రికెటర్ ఎంగేజ్మెంట్! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు












Click it and Unblock the Notifications