పీరియడ్స్ ఆపడం కోసం టాబ్లెట్స్.. 18 ఏళ్ల విద్యార్థినికి ఏం జరిగిందంటే ??
యువతులకు, స్త్రీ లకు నెలసరి ( పీరియడ్స్ ) రావడం సహజమే. ప్రస్తుతం యువతులు, ముఖ్యంగా పండుగలు, వివాహాలు, లేదా ఇతర ముఖ్యమైన కార్యక్రమాల కోసం పీరియడ్స్ను ఆలస్యం చేయడానికి హార్మోన్ల మాత్రలను కొందరు వాడుతున్నారు. అయితే ఓ 18 ఏళ్ల ఇంజినీరింగ్ విద్యార్థిని కూడా ఇలానే టాబ్లెట్స్ వాడి.. ఆ తర్వాత కాలు నొప్పి, వాపుతో ఆస్పత్రిలో చేరి చివరికి మరణించడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
'రీబూటింగ్ ది బ్రెయిన్' అనే పోడ్కాస్ట్లో వాస్కులర్ సర్జన్ డాక్టర్ వివేకానంద్ ఈ హృదయ విదారక సంఘటన గురించి వివరించారు. ఏం చెప్పారంటే.. ఒక 18 ఏళ్ల ఇంజనీరింగ్ విద్యార్థిని కాలు, తొడ నొప్పితో ఆసుపత్రికి వచ్చింది. తల్లిదండ్రులు అందుబాటులో లేరని.. 'పూజ ఉండటం వల్ల పిరియడ్స్ ఆపడానికి కొన్ని హార్మోన్ల మాత్రలు తీసుకోవలసి వచ్చిందని చెప్పిందన్నారు. అది DVTకి ఒక కారణమని.. క్లాట్ దాదాపు బొడ్డు వరకు ఉందని స్కాన్ ద్వారా తెలిసిందని,, కేవలం 3 రోజులు మాత్రమే ఆమె మాత్రలు తీసుకుందని వివరించారు.

వెంటనే కుటుంబ సభ్యులతో మాట్లాడాలని చెప్పి.. ఆమె తండ్రితో మాట్లాడినట్టు తెలిపారు. ఆసుపత్రిలో చేర్చి చికిత్స చేయడం చాలా ముఖ్యమని వివరించానని.. కానీ ఆమె తల్లి వద్దని, రేపు ఉదయం వస్తానని చెప్పడంతో ఆగిపోయినట్టు చెప్పారు. కానీ దురదృష్టవశాత్తు, అర్థరాత్రి 2 గంటల ప్రాంతంలో ఫోన్ వచ్చిందని.. ఆ అమ్మాయిని అత్యవసర విభాగానికి తరలించగా.. అప్పటికే శ్వాస తీసుకోవడం లేదని వాపోయారు.
మతపరమైన వేడుక కోసం పిరియడ్స్ ఆలస్యం చేయడానికి హార్మోన్ల మాత్రలు తీసుకోవడమే ఈ మరణానికి కారణమని వైద్యులు నిర్ధారించారు. ఆ ఘటనతో చాలా బాధపడ్డానని డాక్టర్ వివేకానంద్ తెలిపారు. దీంతో డీప్ వెయిన్ థ్రాంబోసిస్ (DVT) గురించి తీవ్ర చర్చ మొదలైంది.
DVT అంటే ఏమిటి? కారణాలు ఏమిటి?
డీప్ వెయిన్ థ్రాంబోసిస్ (DVT) అనేది కాళ్లలోని లోతైన సిరలలో రక్తం గడ్డకట్టే ఒక తీవ్రమైన వైద్య పరిస్థితి. ఈ గడ్డలు కదిలి ఊపిరితిత్తులకు చేరితే పల్మనరీ ఎంబోలిజం అనే ప్రాణాంతక పరిస్థితికి దారితీస్తుంది. ఈ యువతి విషయంలో కూడా ఇదే జరిగింది. హార్మోన్ల మాత్రలు తీసుకోవడం, అలాగే సుదీర్ఘ కాలం ఒకే చోట కూర్చోవడం వంటివి DVTకి కారణాలుగా డాక్టర్ వివేకానంద్ పేర్కొన్నారు.
నేటి కాలంలో ఈ మాత్రలు శరీరంలో హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీసి, రక్త గడ్డకట్టే ప్రమాదాన్ని పెంచుతాయి. డాక్టర్ సలహా లేకుండా ఇలాంటి మాత్రలు వాడటం చాలా ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు. ఒక్కోసారి కీలక సమయాల్లో ఆలస్యం చేయడం వల్ల తిరిగి కోలుకోలేని పరిణామాలు జరుగుతాయి" అని డాక్టర్ వివేకానంద్ ఆవేదన వ్యక్తం చేశారు.
డీప్ వెయిన్ థ్రాంబోసిస్ (DVT) లక్షణాలైన కాలు నొప్పి, వాపు, ఎరుపు రంగు వంటివి కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలని సూచిస్తున్నారు. సకాలంలో రోగ నిర్ధారణ, చికిత్సతో ప్రాణాలను కాపాడవచ్చని చెబుతున్నారు.
-
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్












Click it and Unblock the Notifications