ఈతకల్లు: 15 రోగాలను తగ్గించే సర్వరోగ నివారిణిని ఎప్పుడైనా సేవించారా?
ప్రతిరోజు ఒక గ్లాసు చొప్పున 40 రోజులపాటు తీసుకుంటే శరీరంలో రక్తం మొత్తం శుద్ధి అవుతుంది.
తాటిచెట్ల నుంచి తీసినదాన్ని తాటికల్లు అంటారు. ఈత చెట్ల నుంచి తీసిన దాన్ని ఈత కల్లు అంటారు. కల్లులో 15 రోగాలను తగ్గించే ఔషధ గుణాలున్నట్లు తేలడంతో బెంజి కార్లలో తిరిగేవారు కూడా వచ్చి స్వయంగా కల్లు తాగుతున్నారని తెలంగాణ టూరిజం మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఒక సందర్భంలో చెప్పారు. కల్లులో క్యాన్సర్ ను నాశనం చేసే గుణం ఎక్కువగా ఉంటుందని ఆయుర్వేద నిపుణులు చెబుతారు.

కుండలు కట్టి సేకరణ
ఈత చెట్లకు ఉండే మట్టలను నాలుగైదుసార్లు చెక్కడంద్వారా వాటి నుంచి వచ్చే కల్లును కుండలు కట్టి సేకరిస్తారు. ముందుగా లోపలి మట్టను చెక్కుతారు. వారంరోజులపాటు దాన్ని అలాగే వదిలిపెడతారు. వారంరోజులు ముగిసిన తర్వాత మరోసారి చెక్కుతారు. అప్పటి నుంచి కుండలోకి కల్లు కారుతూ ఉంటుంది. ఆ మట్టలకు కట్టిన కుండను మూడురోజులుంచి తర్వాత తీసేస్తారు. అప్పటికే ముందుగా కారిపోయిన కల్లు పులిసిపోయి ఉంటుంది. కారిన కల్లుతో కలిసి తాజాగా వచ్చిన కల్లు మరింత నిషా ఇచ్చేదిగా మారుతుంది. తాటికల్లును కూడా ఇదే పద్ధతిలో సేకరిస్తారు. కాకపోతే ఈరోజు కట్టిన కుండను తర్వాత రోజు తీసేస్తారు. నిల్వ ఉన్న కల్లు తాగడం చాలా తక్కువ. ఈత చెట్ల నుంచి తీసిందైతే అది అప్పటికే చెట్టుమీదే 7 నుంచి 10 రోజులపాటు ఉండిపోతుంది.

గ్లాసు చొప్పున 40 రోజులు
ప్రతిరోజు ఒక గ్లాసు చొప్పున 40 రోజులపాటు తీసుకుంటే శరీరంలో రక్తం మొత్తం శుద్ధి అవుతుంది. ఇందులో ఉండే లవణాలు, ఖనిజాలు, విటమిన్లు ఎంతో మేలు చేస్తాయని పూర్వీకులు చెబుతుంటారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రజలు కల్లును ఔషధంగా భావిస్తారు. కల్లునిచ్చే చెట్లను కల్పవృక్షాలుగా కొలుస్తారు. ఈతకాయలు తింటే అల్జీమర్స్ సమస్య తగ్గుముఖం పడుతుందని తేలింది. చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించే శక్తి ఈతకాయలకు ఉంది. కల్లులో శరీరానికి మేలు చేసే 18 రకాల సూక్ష్మక్రిములున్నాయని పరిశోధకులు తెలియజేస్తున్నారు. చఖరో మైసెస్ అనే సూక్ష్మ జీవికి కడుపులో క్యాన్సర్ వ్యాధికి కారణమయ్యే ఓబీఎస్ 2 అనే క్యాన్సర్ కారకాలను నశింప చేస్తుంది. జీర్ణవ్యవస్థను బాగుచేయడంలో దీనిపాత్ర అమూల్యం.

జీర్ణవ్యవస్థకు ఉపయోగం
మనలో చాలా మంది తాటి కల్లును సేవిస్తూ ఉంటారు. ప్రతిరోజూ తాగే వారు కూడా ఉన్నారు. మాంసాహారాలు, జంక్ ఫుడ్, మసాలా వంటి ఆహారపు అలవాట్లతో అస్తవ్యస్థమైన మనిషి జీర్ణాశయ వ్యవస్థను కల్లు ఎంతగానో దోహదపడుతుందని తెలుపుతున్నారు. పరగడుపునే తీసుకుంటే చక్కటి ఆరోగ్యం సొంతం చేసుకోవచ్చు. శరీరంలోని వ్యర్థాలన్నీ బయటకు పోయి శరీరం అంతర్గతం శుభ్రపడుతుంది.
-
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
IPL తొలి మ్యాచ్ లోనే సెన్సేషన్, ఎవరీ కూపర్ కనోలీ - సూర్యవంశీని డామినేట్ చేస్తూ..!! -
పాల ధరలు భారీగా పెంపు, ఒకే సారి - కొత్త రేట్లు ఇలా..!! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
జన్మ నక్షత్రం మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
ఈ టైంలో కరెంట్ వాడితే బాదుడే, విద్యుత్ ఛార్జీల్లో మార్పులు - నేటి నుంచే అమలు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..!











Click it and Unblock the Notifications