health tips: ఈ 5 నొప్పులను ఎప్పుడూ విస్మరించొద్దు.. అవి ప్రమాదకరం కావొచ్చు!!
నిజ జీవితంలో మనం అనుసరిస్తున్న జీవన విధానం వల్ల, తింటున్న ఆహారం, శారీరక వ్యాయామం లేకుండా సాగిస్తున్న జీవనం, పని ఒత్తిడి వంటి కారణాలు నిత్యం మన శరీరంలో అనేక నొప్పులకు కారణంగా మారుతున్నాయి. అయితే కొన్ని శరీరభాగాలు విపరీతంగా నొప్పి గా ఉన్నప్పటికీ పట్టించుకోకపోతే అవి మరింత ప్రమాదకరంగా మారి, ఇతర అనారోగ్యాలను కలిగించే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. 5రకాల నొప్పులను ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదని సూచిస్తున్నారు.
ఇక ఆ నొప్పులు ఏమిటంటే.. కండరాల నొప్పి. కండరాల నొప్పి రావడానికి అనేక కారణాలు ఉన్నప్పటికీ, ముఖ్యంగా విటమిన్ల లోపం వల్ల కండరాల నొప్పి వస్తుందన్న విషయాన్ని గుర్తించి తదనుగుణంగా పౌష్టికాహారాన్ని తీసుకోవాలి. అయినప్పటికీ కండరాల నొప్పి తగ్గకుంటే కచ్చితంగా డాక్టర్ని సంప్రదించాలి.

నడుం నొప్పి, పిరుదుల నొప్పి. ఇంతకు ముందు ఈ సమస్య వృద్ధాప్యంలో ఉన్న వాళ్లకు మాత్రమే వచ్చేవి. కానీ ఇప్పుడు చిన్నా పెద్దా అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరికి వస్తున్నాయి. చాలా మంది యువత కూడా నడుమునొప్పి, పిరుదుల నొప్పితో తెగ బాధపడుతున్నారు. అయితే రోజు వచ్చే నొప్పే కదా అని నిర్లక్ష్యం చేయకుండా ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్లి చికిత్స తీసుకోవాలి.
నిర్లక్ష్యం చేయకూడని మరొక నొప్పి కడుపు నొప్పి. కడుపు నొప్పి వచ్చిందని ఏదో పెయిన్ కిల్లర్ టాబ్లెట్ వేసుకొని ఆ సమయానికి కడుపునొప్పి నుండి ఉపశమనం పొందుతారు. పదేపదే కడుపునొప్పి వస్తే అది మూత్రనాళ ఇన్ఫెక్షన్ కి కానీ, జీర్ణాశయ రుగ్మతలకు కానీ, పునరుత్పత్తి వ్యవస్థకు సంబంధించి సమస్య కావచ్చు. కాబట్టి కడుపు నొప్పిని కూడా నిర్లక్ష్యం చేయకుండా వైద్యుల వద్ద చూపించుకోవాలి.
నిర్లక్ష్యం చేయకూడని మరొక నొప్పి ఛాతీ నొప్పి. చాలామంది ఛాతిలో నొప్పిగా ఉంటే పెద్దగా పట్టించుకోరు. ఛాతీలో నొప్పి ఎడమవైపున వస్తే అది మరింత డేంజర్ అని చెబుతున్నారు. ఇది ముందు ముందు గుండెజబ్బులకు కూడా కారణం కావచ్చు అని, అందుకే ఛాతి నొప్పి ఉన్నప్పుడు, తరచుగా నొప్పిగా ఉంటున్నప్పుడు వైద్యులను సంప్రదించాలని చెబుతున్నారు.

నిర్లక్ష్యం చేయకూడని ఇంకొక నొప్పి తలనొప్పి. సరిగా నిద్ర లేకపోవడం వల్ల, పని ఒత్తిడి ఎక్కువగా ఉండడం వల్ల, ఎక్కువ భావోద్వేగాలకు గురి కావడం వల్ల తలనొప్పి వస్తూ ఉంటుంది. అయితే పదే పదే తలనొప్పి వస్తున్న అలవాటేలే అని నిర్లక్ష్యంగా వదిలేస్తే అది తలలో అనేక కొత్త అనారోగ్య సమస్యలకు కారణం కావచ్చని దీని ప్రభావం బ్రెయిన్ పైన పడే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. అందుకే ఈ నొప్పులను పొరపాటున కూడా నిర్లక్ష్యం చేయకూడదని సూచిస్తున్నారు.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.
-
మజ్జిగలో ఇవి కలిపితే అమృతమే -
గరం గరం పాయా సూప్ తీసుకోండి చాలు- ఏ పుత్తూరు కట్టూ అవసరం లేదు -
వేసవిలో శరీరానికి చల్లదనం ఇచ్చే "వెజిటెబుల్ మజ్జిగ పులుసు" ట్రై చేస్తారా..? -
ఏలినాటి శని వెంటాడుతోందా? 'పొంగు శని'ని దర్శించుకుంటే అష్టైశ్వర్యాలే! -
బంగారం ధరల్లో లాభాల మోత -
బెంగళూరు, మైసూర్ కు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..! -
Tamil Nadu polls: చివరి 'బ్రహ్మాస్త్రం' ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..!











Click it and Unblock the Notifications