Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఐటీ ఉద్యోగుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయ్.. ఎమర్జెన్సీ అలెర్ట్!

భారతదేశంలోని టెక్ పరిశ్రమలో ఒక భయానక ఆందోళన కనిపిస్తుంది. అదేమిటంటే, టెక్ కంపెనీలలో పని చేసే యువకుల్లో చాలావరకు ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. దీనికి కారణం పని ఒత్తిడి ఎక్కువ అవ్వడమే అంటున్నారు మానసిక వైద్యనిపుణులు. ఎప్పుడూ పరుగులు పెట్టేలా ఉండే వాతావరణం, ప్రొఫెషనల్ గ్రోత్ కోసం ఎక్కువ ఆశలు పెట్టుకోవడం వంటివి మానసిక ఆరోగ్య సమస్యలకు దారి తీస్తున్నాయి.

ఒత్తిడికి కారణాలు

ప్రస్తుతం ఉద్యోగం చేసేవారు ఎక్కువగా ఒత్తిడికి గురవ్వడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఎక్కువ గంటలు పనిచేయడం, ఇచ్చిన సమయానికి పనులు పూర్తి చేయాలి అనే ఒత్తిడి, ఉద్యోగం ఉంటుందో లేదో అన్న భయం వంటివి ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఎప్పటికప్పుడు కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఒత్తిడి కూడా పెరుగుతోంది. ఇవన్నీ కలిసి ఉద్యోగులకు కష్టమైన పని వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. ఇది మానసిక ఆరోగ్యంపై చెడు ప్రభావాన్ని చూపిస్తుంది.

IT professionals faces a crisis with workplace stress rising suicide rates

Take a Poll

మానసిక ఆరోగ్యంపై ప్రభావం

టెక్ ఉద్యోగాల్లో ఉండే ఒత్తిడి, మానసిక ఆరోగ్యంపై చాలా ప్రభావం చూపిస్తోంది. చాలా మంది ఉద్యోగులు ఆందోళన, డిప్రెషన్, బాగా అలసిపోవడం వంటి సమస్యలతో బాధపడుతున్నారు. చాలా మంది ఒంటరిగా ఫీలవుతూ, తమ ఉద్యోగాల్లోని ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నారు. అందుకే ఐటీ పరిశ్రమలో ఆత్మహత్యల సంఖ్య పెరుగుతోంది.

సహాయం చేసే వ్యవస్థల అవసరం

పని చేసే చోట సరైన సహాయం చేసే వ్యవస్థలు ఉండటం చాలా అవసరం. కంపెనీలు ఉద్యోగులలో ఒత్తిడిని తగ్గించడానికి కౌన్సెలింగ్ అందించాల్సిన అవసరం. అలాగే ఉద్యోగులకు నచ్చినట్లు పని చేసుకునే అవకాశం ఇవ్వాలి. ఇలాంటి సపోర్ట్ సిస్టమ్స్ ఉంటే ఒత్తిడి తగ్గుతుంది, మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. లేదంటే వాళ్ళు తీవ్రమైన డిప్రెషన్ లోకి వెళ్లే ప్రమాదం ఉంది.

కంపెనీలు, ప్రభుత్వాల పాత్ర

ఉద్యోగులలో విపరీతంగా పెరుగుతున్న మానసిక ఒత్తిడిని పరిష్కరించడంలో కంపెనీలు ముఖ్యమైన పాత్ర పోషించాలి. ఉద్యోగులు, వ్యక్తిగత జీవితానికి, పనికి మధ్య సమతుల్యత ఉండేలా చూడాలి. ప్రభుత్వాలు కూడా ఉద్యోగుల మానసిక ఆరోగ్యాన్ని కాపాడే చట్టాలు తీసుకురావాలి. అందరూ కలిసి పనిచేస్తేనే ఈ రంగంలో మార్పులు తీసుకు రావడానికి వీలవుతుంది.

మార్పు రావాలి

ప్రస్తుతం ఐటి ఉద్యోగాలు చేస్తున్న యువతలో ఆత్మహత్యలు పెరగడం, వారిలో పెరుగుతున్న ఒత్తిడి, మానసిక ఆందోళనలను స్పష్టంగా చూపిస్తుంది. భారతదేశ టెక్ రంగంలో తగిన సహాయం చేసే వ్యవస్థలు, సరైన విధానాలు ఉంటే పని ఒత్తిడిని తగ్గించవచ్చు. ఐటి ఉద్యోగులు కూడా ఎవరికి వారు వ్యక్తిగతంగా ఒత్తిడిని తగ్గించుకునేందుకు యోగా, మెడిటేషన్ వంటివి చేయడం అలవాటు చేసుకోవాలి. వారి వారి జీవన విధానాన్ని మార్చుకోవడంతో పాటు, ప్రభుత్వాలు కూడా వారికోసం సహకారాన్ని అందించాలి. ముఖ్యంగా కంపెనీల యొక్క పని విధానంలో మార్పు రావాలి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+