హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణ పంచాయతీరాజ్ శాఖలో 529 పోస్టుల భర్తీకి కసరత్తులు షురూ

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖలో ఖాళీ పోస్టుల భర్తీకి కసరత్తులు మొదలయ్యాయి. ఆర్థిక శాఖ ఇటీవలే రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖకు 529 పోస్టులను మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయా పోస్టులను వివిధ జిల్లాలకు విభజిస్తూ రాష్ట్ర పంచాయతీరాజ్‌ డైరెక్టర్‌ హనుమంతరావు ఉత్తర్వులు జారీ చేశారు.

జిల్లా పరిషత్తు (జెడ్పీ), జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయాల్లో (డీపీవో) వివిధ పోస్టులను మంజూరు చేస్తూ ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వీటిలో జెడ్పీ సూపరిటెండెంట్‌ పోస్టులు 103, జెడ్పీ సీనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులు 151, జెడ్పీ జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులు 213 ఉన్నాయి.

529 posts in Telangana panchayat raj department

ఇక, జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయాల్లో సీనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులు 22, జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులు 40 మంజూరు అయ్యాయి. వీటిలో కొన్నింటిని నేరుగా, మరి కొన్నింటిని ప్రమోషన్ల ద్వారా భర్తీ చేయనున్నారు.

అత్యధికంగా సిద్దిపేట జిల్లాకు 34, సంగారెడ్డి, నిర్మల్‌, నాగర్‌కర్నూల్‌, మెదక్‌ జిల్లాలకు 27 పోస్టుల చొప్పున మంజూరయ్యాయి. త్వరలోనే ఈ ఖాళీలను భర్త చేసేందుకు కసరత్తులు ప్రారంభమయ్యాయి.

English summary
529 posts in Telangana panchayat raj department.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X