తెలంగాణలో ఉద్యోగాల జాతర: డిసెంబర్లో 3 గ్రూప్స్ నోటిఫికేషన్లు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగార్థులకు త్వరలోనే వరుస శుభవార్తలు అందనున్నాయి. ఆర్థిక అనుమతులు లభించడంతో భారీ ఎత్తున ఉద్యోగాల భర్తీకి టీఎస్పీఎస్సీ సిద్ధమైంది. ఇప్పటికే గ్రూప్-1, పోలీస్, వైద్యారోగ్యశాఖతోపాటు వివిధ శాఖల్లో అసిస్టెంట్ ఇంజినీర్ తదితర పోస్టులకు నోటిఫికేషన్లు వచ్చిన విషయం తెలిసిందే. వీటిలో పోలీస్, గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షలు కూడా పూర్తయ్యాయి.
పోలీసు విభాగంలో సబ్ ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్ ఉద్యోగాలకు డిసెంబర్ 8 నుంచి దేహ దారుఢ్య పరీక్షలు జరగనున్నాయి. మరోవైపు, గ్రూప్-1 మెయిన్స్ను వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరిలో నిర్వహిస్తామని టీఎస్పీఎస్సీ ఇప్పటికే ప్రకటించింది. ఇప్పటివరకు 80,039 ఉద్యోగాల్లో 61,804 పోస్టులకు ఆర్థికశాఖ అనుమతినిచ్చింది. మిగిలిన మరో 18,235 ఉద్యోగాలకు కూడా త్వరలోనే అనుమతి లభించనుంది.
ఉద్యోగాల
భర్తీ
ప్రక్రియలో
భాగంగా
టీఎస్పీఎస్సీ
వరుస
నోటిఫికేషన్లు
జారీ
చేయనుంది.
వచ్చే
నెల
అంటే
డిసెంబర్లో
మరో
మూడు
కీలక
ప్రకటనలు
చేయనుంది.
నిరుద్యోగ
యువత
ఎప్పటినుంచో
ఎదురుచూస్తున్న
గ్రూప్-2,
3,
4
నోటిఫికేషన్లు
మూడు
వచ్చేనెలలో
జారీ
చేసేందుకు
కసరత్తు
చేస్తుంది.
గ్రూప్-2,
3,
4కి
సంబంధించి
ఇప్పటికే
ఆర్థికశాఖ
అనుమతి
ఇవ్వడంతో
భర్తీ
ప్రక్రియను
టీఎస్పీఎస్సీ
వేగవంతం
చేసింది.
గ్రూప్-2లో
భాగంగా
726
ఉద్యోగాలు,
గ్రూప్-3లో
1,373
ఉద్యోగాలు,
గ్రూప్-4లో
9,168
ఉద్యోగాలు
భర్తీ
చేయనుంది.
మరోవైపు, గ్రూప్-2, 3, 4లో కొత్తగా కొన్ని పోస్టులను చేరుస్తూ.. నవంబర్ 24వ తేదీన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంనది. గ్రూప్ -2లో మరో 6 రకాల పోస్టులు, గ్రూప్ -3లో మరో 2, గ్రూప్ -4లో మరో 4 రకాల పోస్టులను చేర్చింది. గ్రూప్ -2లో రాష్ట్ర ఎన్నికల సంఘం, ఇతర శాఖలకు చెందిన ఏఎస్వో, జువైనల్ డిస్ట్రిక్ట్ ప్రొబేషనరీ ఆఫీసర్, అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్, అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్, అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులు చేరాయి.
గ్రూప్-3లో గిరిజన సంక్షేమశాఖ అకౌంటెంట్, హెచ్వోడీల్లోని సీనియర్ అసిస్టెంట్, సీనియర్ అకౌంటెంట్, జూనియర్ అసిస్టెంట్, జూనియర్ అకౌంటెంట్ పోస్టులను చేర్చింది. గ్రూప్-4లో జిల్లా కార్యాలయాల్లో జూనియర్ అసిస్టెంట్, అకౌంటెంట్, జువైనల్ సర్వీసెస్ సూపర్వైజర్ మేల్, జువైనల్ సర్వీసెస్ మ్యాట్రన్ స్టోర్కీపర్, సాంకేతిక విద్యాశాఖ మ్యాట్రన్ పోస్టులను చేర్చింది. గతంలో గ్రూప్-2లో 663 ఉద్యోగాలకు ఆర్థికశాఖ అనుమతి ఇవ్వగా.. తాజా చేర్పులతో ఆ సంఖ్య 726కు చేరింది.