త్వరలో ఈ రాశులవారు పట్టిందల్లా బంగారమే అంటున్న లక్షాధిపతి యోగం!
జనవరి చివరి వారంలో అత్యంత అరుదైన లక్షాధిపతి యోగం ఏర్పడబోతుంది. ఈ అరుదైన లక్షాధిపతి యోగం మౌని అమావాస్య రోజున ఏర్పడుతుంది. ఈ సంవత్సరం మౌని అమావాస్య జనవరి 29వ తేదీన వస్తుంది. మౌని అమావాస్య రోజున ఎవరైతే దానధర్మాలు, ఉపవాసాలు, పరిహారాలు చేస్తారో వారికి అన్ని విధాల శుభం జరగబోతుంది.
మౌని అమావాస్య రోజునే లక్షాధిపతి యోగం
ఇక మహాకుంభమేళాలో కూడా మౌని అమావాస్య రోజున మూడవ రాజ స్నానం జరుగుతుంది. ఇక జ్యోతిష శాస్త్ర ప్రకారం మౌని అమావాస్య రోజున అత్యంత ముఖ్యమైన లక్షాధిపతి యోగం ఏర్పడుతుంది. ఈ యోగం కారణంగా కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. మరి ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం.

మేషరాశి
మేషరాశి జాతకులకు లక్షాధిపతి యోగం కారణంగా ఆర్థిక సంక్షోభాలు తొలగిపోతాయి. ఈ సమయంలో ఏ పని చేసినా వీరికి కలిసి వస్తుంది. బంధువులు, సోదరుల ద్వారా వ్యాపారాలు పుంజుకుంటాయి. వర్తక వ్యాపారాలు చేసే వారికి సంపాదన పెరుగుతుంది. నూతన వ్యాపారాలు చేయాలనుకునే వారికి అనుకూలమైన సమయం. ఇక ఫిబ్రవరి ప్రారంభం నాటికి ఈ రాశుల వారి తలరాత మారిపోతుంది.
మకర రాశి
లక్షాధిపతి యోగం కారణంగా మకర రాశి వారికి కలిసి వస్తుంది. మకర రాశి జాతకులు పనిలో ప్రయోజనాలను పొందుతారు. ఈ రాశుల వారు ఉన్నత స్థానాలను పొందే అవకాశం ఉంది చదువు పూర్తి చేసుకున్న వారు ఉద్యోగాల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇది వీరికి ఆర్థిక సమస్యలను దూరం చేస్తుంది. కోరుకున్న వాటిని సొంతం చేసుకోగలుగుతారు.
తులారాశి
తులారాశి వారికి లక్షాధిపతి యోగం కారణంగా ఆర్థిక సమస్యలు దూరం అవుతాయి. జీవితంలో చాలా విషయాలను సాధించగలుగుతారు. తులా రాశి జాతకులు ఈ సమయంలో ఏ పని చేసినా కలిసి వస్తుంది. అన్ని విధాలా లబ్ధిని పొందుతారు. తులా రాశి వారిని ఈ సమయంలో విజయం వరిస్తుంది.
కుంభరాశి
కుంభ రాశి వారికి లక్షాధిపతి యోగం కారణంగా వ్యాపారంలో రాణించే అవకాశాలు ఉన్నాయి. కుంభ రాశి వారు పనిచేసే చోట గుర్తింపు పొందుతారు. జీవితంలో ఆశించిన స్థాయిని పొందుతారు. వర్తక వ్యాపారాలు చేసేవారు పేరును, కీర్తిని గడిస్తారు. ఇది కుంభరాశి వారికి అదృష్ట సమయం.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications