మాఘమాసం విశిష్టత: ఆ దేవున్ని పూజిస్తే ఎలాంటి లాభాలు కలుగుతాయో తెలుసా..!
డా. ఎం. ఎన్. ఆచార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు - శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151
మాఘ మాసం ఎంతో విశిష్టమైనది. ఈ మాసంలో వచ్చే ముఖ్యమైన తిథి శుక్ల పక్ష చవితి దీనిని తిల చతుర్థి అం టారు. దీన్నే కుంద చతుర్థి అని కూడా అంటారు, నువ్వులను తింటారు, నువ్వులతో లడ్లు చేసి పంచి పెడతారు. ఈ రోజున "డుంఢిరాజును" ఉద్దేశించి, నక్త వ్రతము పూజ చేస్తారు! డుంఢిని ఈ విధంగా పూజించడం వలన దేవతల చేత సైతం పూజలందుకుంటారని కాశీ ఖండములో తెలియజేశారు. "కుంద చతుర్థి" నాడు కుంద పుష్పాలతో పరమేశ్వరుని అర్పించి రాత్రి జాగారణ చేసినవారు, సకలైశ్వర్యాలను పొందుతారని కాలదర్శనంలో చెప్పబడింది. అయితే సాయంకాలం చతుర్థి ఉంటే ఉత్తమం అని ఈ సందర్భంలో తెలుసుకోవాలి.
మాఘమాసంలో ప్రాత:కాలంలో చేసే స్నాన, జప, తపములు చాలా ఉత్తమమైనవి. ఈ మాసంలో స్నానం చేసేటప్పుడు దు:ఖ దారిద్ర్య నాశాయ, శ్రీ విష్ణోతోషణాయచ! ప్రాత:స్నానం కరోమ్య, మాఘ పాప వినాశనం! అని చేసిన తరువాత సవిత్రేప్రసవిత్రేచ! పరంధామజలేమమ! త్వత్తేజసా పరిబ్రష్టం,పాపం యాతు సస్రదా! అని చదవాలని శాస్త్రాలు చెబుతున్నాయి.
సూర్య
భగవానునికి
ఆర్గ్యమివ్వాలి.
ఈ
మాసాన్ని
కుంభమాసం
అని
కూడా
అంటారు.
కొంత
మంది
ఈ
నెల్లాళ్ళు
ముల్లంగి
దుంపను
తినరు.
ఈ
మాసంలో
నవ్వులను,
పంచదారను
కలిపి
కలిపి
తినాలట.
నువ్వులను
దానమివ్వాలట,
రాగి
పాత్రలో
గోధుమ
రంగుగా
ఉన్న
నువ్వులను
పాత్రతో
సహా
దానమిస్తే
మంచిది.
ఈ
నెలలో
మరణించిన
వారికి
అమృతత్వం
సిద్దిస్తుందట.
మాఘశుద్ద
పంచమి"ని
శ్రీ
పంచమి
అంటారు.
ఈ
పంచమి
నాడే
సరస్వతీదేవి
జన్మించిందట.
ఈనాడు
"రతీ
మన్మధులను
మల్లెపూలతో
పూజిస్తారు.
ఉత్తర
భారతంలో
విష్ణుమూర్తిని,
సరస్వతీదేవిని
కూడా
పూజిస్తారు.
బ్రహ్మదేవుడు సృష్టి చేయగా చరాచర ప్రపంచం శ్మశాన నిశ్శబ్ధతతో ఉందట. అవేదనతో తన కమండలంలోని నీటిని ప్రపంచంపై చిలకరించగా చెట్లపై ఆ నీటి బిందువులు పడి ఒక శక్తి ఉద్భవించిందట. రెండు చేతులతో వీణను వాయిస్తూ మరో రెండు చేతులతో పుస్తకాన్ని మాలను ధరించి సమగ్ర రూపిణిగా దర్శనమిచ్చిందట. ఆ వగీశ్వరి వీణావాదనం ద్వారా ప్రపంచంలోని స్తబ్థతను ఉదాసీనతను తొలగించి విద్యాబుద్దులకు అదిష్టాత్రి అయింది ఆ దేవి. అప్పటి నుండి శ్రీ పంచమి రోజును సరస్వతిని పూజించడం జరుగుతుంది.
మాఘశుద్ద
సప్తమి
ఇదే
"సూర్య
సప్తమి"
అని
కూడా
పిలువబడుతుంది.
ఇదే
రథసప్తమి
సుర్య
గ్రహణదినం
వలె
ఇది
పరమపవిత్రమైనది.
ఈ
రోజున
అరుణోదయకాలంలో
ఏడు
జిల్లేడు
ఆకులను
అందులో
రేగికాయలను
ఉంచుకొని
తలాపై
పెట్టుకొని
స్నానం
చేస్తే
ఏడు
విధాలైన
శాపాలు
నశిస్తాయట.
స్నానికి
ముందు
చెరకుగడతో
నీటిని
కదిలిస్తారు...
నమస్కార
ప్రియ:సూర్య:
అన్న
ఆర్య
వాక్య
ప్రకారం
కేవలం
నమస్కారం
చేతనే
సూర్యుడు
సంతృపి
చెందుతాడని
తెలుస్తుంది.
ఈ
రోజున
చిక్కుడుకాయలతో
రథం
చేసి
కొత్త
బియ్యంతో
పాయసాన్ని
వండి
చిక్కుడు
అకులలో
పెట్టి
సూర్యునికి
నివేదన
చేయడం
ఆచారం.
సూర్యుడు తనను పూజించిన సత్రాజిత్తుకి ఈ రోజునే "శమంతకమణి" ప్రసాదించాడు. హనుమంతునికి వ్యాకరణ శాస్త్రాన్ని యజవాల్క్యునికి యజుర్వేదాన్ని బోధించాడు,ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అన్న వాక్యం ప్రకారం ఆరోగ్యం కొరకు ఆదిత్య హృదయం పారాయణ చేయాలి. రథసప్తమి నాటి స్నానం సప్త సప్త మహాసప్త ద్వీపా వసుంధరా! కోటి జన్మార్జితంపాపిం వినశ్యతితత్క్షణాత్ అన్నట్లుగా పాప విముక్తి కలిగిస్తుందట. భీష్మాష్టమి "మాఘమానస్యచాష్టమ్యాం శుక్ల పక్షేచ పార్థివ! ప్రాజాపత్యేచ నక్షత్రే మధ్య:ప్రాప్తే దివాకరే!" శోభకృత నామ సంవత్సరంలో మాఘమాసంలో శుక్లపక్షంలో రోహిణి నక్షత్రం ఉన్న అష్టమి తిథినాడు మధ్యాహ్నం సూర్యుడు నడినెత్తిన ప్రకాశిస్తూ ఉండగా అభిజిత్ లగ్నంలో భీష్మ పితామహుడు ధ్యాన స్థితుడై ప్రాణాలను విడిచిపెట్టాడట.
స్వచ్చంద మరణం ఆయనకి వరం. ఆయనకు తర్పణలు విడిచి పెట్టడం నెలగంటు పెట్టినప్పటినుంచీ పెట్టిన గొబ్బెమ్మలను ఎండబెట్టి దాచి ఆ పిడకలతో పాయసాన్ని వండి నివేదన చేయడం ముఖ్యం. అష్టమినాడే దైవ సాయుజ్యం పొందినా శ్రీ కృష్ణుని సమక్షంలోనే విష్ణుసహస్రనామాలతో ఆయనను కీర్తిస్తూ మోక్షం పొందాడు. కాబట్టి ఏకాదశిని ఆయన పేరుతో ఏర్పాటు చేశారు. భీష్మ ఏకాదశి నాడు విశేష పూజలు చేయడం ఆనవాయితీ. ఇక మాఘమాసంలో వచ్చే ప్రతి ఆదివారాలు మహిమాన్వితాలే.