దహనమైనా.. నేటినుండి ఈ రాశులను కోటీశ్వరులను చేస్తున్న బుధుడు!
వేద జ్యోతిష శాస్త్రంలో గ్రహాల సంచారం కీలకమైనది. ప్రతి గ్రహం నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరొక రాశిలోకి సంచారం చేస్తుంది. గ్రహాల సంచారం కారణంగా ద్వాదశ రాశుల వారి జీవితం ప్రభావితం అవుతుంది. ఇక ఈరోజు ఉదయం 6 గంటల 54 నిమిషాలకు బుధుడు ధనుస్సు రాశిలో దహనం ప్రారంభించాడు. బుధుడు సూర్యుడికి చాలా దగ్గరగా వచ్చినప్పుడు బుధుడు దహనం అవుతాడు.
బుధ దహనం.. అదృష్ట రాశులు
బుధ దహనం కారణంగా బుధుడు యొక్క శక్తి మరియు ప్రభావం తాత్కాలికంగా బలహీనపడుతుంది. ఆ తరువాత ఫిబ్రవరి 26వ తేదీ బుధుడు ధనుస్సు రాశి నుంచి కుంభరాశిలోకి సంచారం చేసి రాత్రి 8 గంటల 41 నిమిషాలకు ఉదయిస్తాడు. ఇక నేటి బుధుడి దహనం కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలను మరికొన్ని రాశుల వారికి అశుభ ఫలితాలను ఇస్తుంది. శుభ ఫలితాలను ఇచ్చే రాశులు ఏమిటో ప్రస్తుతం తెలుసుకుందాం.

మేషరాశి
బుధ దహనం కారణంగా మేష రాశి వారికి సానుకూల ఫలితాలు వస్తాయి. వృత్తిపరమైన మరియు ఆర్థిక విషయాలలో మేష రాశి జాతకులు అదృష్టాన్ని పొందుతారు. వర్తక వ్యాపారాలు చేసేవారు లాభాలను ఆశించవచ్చు. ఈ సమయంలో పెట్టిన పెట్టుబడులు గణనీయమైన ఫలితాలను ఇస్తాయి. కొత్త ప్రాజెక్టులను ప్రారంభించడానికి మేష రాశి వారికి ఇది సరైన సమయం.
సింహరాశి
సింహ రాశి వారికి బుధ దహనం కారణంగా మంచి ఫలితాలు వస్తాయి. సింహరాశి జాతకులలో ఈ సమయం సృజనాత్మకతను, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఇది కెరీర్ పురోగతికి దోహదం చేస్తుంది. విద్యార్థులు సృజనాత్మక రంగాలలో ఉన్నవారు ఈ సమయాన్ని ప్రత్యేకంగా భావిస్తారు. సింహ రాశి వారు మేధస్సు మరియు కళాత్మక విషయాలలో రాణిస్తారు.
ధనుస్సు రాశి
బుధ దహనం కారణంగా ధనుస్సు రాశి జాతకులకు అదృష్టం కలిసి వస్తుంది. ధనుస్సు రాశి జాతకులకు ఈ సమయంలో వ్యక్తిగత మరియు వృత్తిపరమైన వృద్ధికి కలిసి వస్తుంది. వృత్తి జీవితంలో ఆర్థిక లాభాలతో మంచి ఫలితాలు వస్తాయి. ధనుస్సు రాశి జాతకులు తమ దీర్ఘకాలిక లక్ష్యాలను సాధించేందుకు ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications