700 ఏళ్ల తర్వాత రాఖీ రోజు గ్రహాల అరుదైన కలయిక
పౌర్ణమి తిథి ఈ సంవత్సరం రెండురోజులుండటంతో భద్రకాలంపై ఎవరికీ అవగాహన ఉండటంలేదు. భద్రకాలంలో కూడా రాఖీలు కడుతుంటారు. అయితే ఏ సమయంలో పడితే ఆ సమయంలో కట్టడం మంచిది కాదని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. పండగ రెండురోజులు ఉండటంతో ఏ సమయంలో రాఖీ కడితే బాగుంటుందో తెలుసుకుందాం.
తెలుగు క్యాలెండర్ ప్రకారం.. ఆగస్టు 30న భద్ర 10.05 గంటలకు ప్రారంభమై రాత్రి 08.58 గంటలకు ముగియనుంది. ఈ సమయంలో రాఖీలు కట్టడం అశుభమని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలియజేస్తున్నారు. రాత్రిపూట భద్ర సమయం ముగిసిన గంట తర్వాత కట్టడం మంచిదని సూచిస్తున్నారు. సాధ్యమైనంతవరకు తర్వాతరోజు ఉదయం 7.37 గంటల నుంచి జరుపుకోవడం ఉత్తమమని చెబుతున్నారు.

రాఖీ భద్ర కాలం ముగింపు సమయం రాత్రి 9:01
రాఖీ భద్ర కాలం రాక రాత్రి 5:30 నుంచి 06:31 వరకు
రాఖీ భద్ర కాలం ఉండే సమయం రాత్రి 6:31 నుంచి 8:11 వరకు
ఆగస్టు 30వ తేదీన సూర్యుడు, బుధుడు, గురుడు, శుక్రుడు, శని గ్రహాలు సంచరించబోతున్నాయి. దీని కారణంగా పంచ మహాయోగం ఏర్పడబోతోంది. జ్యోతిష్య శాస్త్ర పండితులు తెలిపిన ప్రకారం ఈ గ్రహాల సంచారంవల్ల బుధాదిత్య, వాసరపతి, గజకేసరి, షష యోగాలు ఏర్పడుతున్నాయి. కొత్త వస్తువులు, వాహనాలను ఈ సమయంలో కొనుగోలు చేస్తే మంచిది. దాదాపు 700 ఏళ్ల తర్వాత రాఖీ పండగ రోజున గ్రహాల్లో మార్పులు జరగబోతున్నాయి. ఈ మార్పులు అన్ని రాశులవారికి శుభసూచికమని, అన్నివిధాలుగా కలిసి రాబోతోందని జ్యోతిష్య నిపుణులు తెలిపారు.












Click it and Unblock the Notifications