మేషరాశి, ధనుస్సురాశి, సింహరాశుల వారికి నేటినుండి పట్టిందల్లా బంగారం.. శని మహిమ!
వేద జ్యోతిష్య శాస్త్రంలో శని గ్రహానికి చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది. శనిని కర్మ దేవతగా చెప్తారు. క్రమశిక్షణకు మారుపేరైన, న్యాయ దేవుడు శనిదేవుడు అన్ని రాశులవారి జాతకాలను ప్రభావితం చేస్తున్నాడు. అటువంటి శనిదేవుడు ఉత్తరాభాద్ర నక్షత్రంలో మూడవ దశలోకి నేడు వెళ్తున్నాడు.
ఉత్తరాభాద్ర మూడవ దశలోకి శని
మార్చి 21వ తేదీ సాయంత్రం 4 గంటలకు ఉత్తరాభాద్ర నక్షత్రంలో మూడవ దశలోకి వెళ్తున్న క్రమంలో శనిదేవుడు కొన్ని రాశులవారికి అదృష్టాన్ని ఇస్తున్నాడు.ఈ సమయంలో వీరికి సంపదల వర్షం కురుస్తుంది. నేడు శనిదేవుడు ఉత్తరాభాద్ర నక్షత్రంలో అదృష్టాన్ని ఇచ్చే రాశులు ఏమిటో తెలుసుకుందాం.

మేషరాశి
మేషరాశిలో 12వ ఇంట్లో శని సంచారం చేస్తాడు. ప్రస్తుతం శని నక్షత్రాన్ని మార్పు చేయడంతో పాటు అస్తమయం చెందడం వల్ల మేషరాశి జాతకులకు కలిసి వస్తుంది. ఈ రాశి వారికి ఆరోగ్య సంబంధిత సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. దీర్ఘకాలంగా ఉన్న సమస్యలు పరిష్కారమవుతాయి. శని దృష్టి రెండవ ఆరవ మరియు తొమ్మిదవ ఇళ్ల పైన రంగాలలో అదృష్టం కలిసి వస్తుంది. అప్పుల బాధ నుండి విముక్తి లభిస్తుంది.
సింహరాశి
నేడు శనిదేవుడు ఉత్తరాభాద్ర నక్షత్రంలో మూడవ దశలోకి సంచారం చేయటం సింహరాశి జాతకులకు అదృష్టాన్ని ఇచ్చింది. సింహరాశి జాతకులకు అష్టమ శని ఉన్న క్రమంలో ఇబ్బందులు పడుతున్నప్పటికీ శని నక్షత్రం మార్పు మరియు అస్తమయంతో వ్యాపారాలలో లాభాలను పొందుతారు. దీర్ఘకాలిక ఆందోళనలు తొలగిపోయి, పిల్లల నుండి శుభవార్తలు వింటారు. కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.వీరికి అన్ని విధాలా లాభాలు వస్తాయి.
ధనుస్సు రాశి
ఉత్తరాభాద్ర నక్షత్రంలో మూడవ దశలోకి శని సంచారం చేయడం వల్ల ధనుస్సు రాశి జాతకులకు కలిసొస్తుంది. ఈ సమయంలో ధనుస్సు రాశి వారికి అనేక రంగాలలో ప్రయోజనాలు చేకూరుతాయి. ధనుస్సు రాశిలో నాలుగవ ఇంట్లో శని అస్తమయ స్థితిలో ఉండడం వల్ల ధనస్సు రాశి వారి వ్యాపార సంబంధిత సమస్యలు పరిష్కారం అవుతాయి. మానసిక శారీరక ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. ఉద్యోగాలు చేసే వారికి ప్రయోజనకరంగా ఉంటుంది.
గమనిక: ఈ సమాచారం జ్యోతిష్య నిపుణులు, ఇంటర్నెట్లో లభించిన ఆధారంగా రూపొందించబడింది. దీనిని Oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications