ఈరోజు అక్షయ తృతీయను మించిన శుభదినం.. వారికి మహాయోగం; ఎందుకంటే!!
మే 25వ తేదీ నేడు. ఈరోజుకి పంచాంగం ప్రకారం ఎంతో ప్రత్యేకత ఉంది. ఈరోజు అక్షయ తృతీయ కంటే మంచి రోజని పండితులు చెబుతున్నారు. ఈ రోజు అత్యంత అరుదుగా వచ్చే గురు పుష్య యోగం కలుగుతుందని, నేడు రోహిణి కార్తి కూడా మొదలవుతుందని చెబుతున్నారు.ఈ ఏడాది రెండవ గురు పుష్య యోగం జ్యేష్ట మాసంలోని శుక్ల పక్షంలోని షష్ఠి తిథి నాడు.. అంటే నేడు ఏర్పడింది.
ఉదయం 05:26 నుండి సాయంత్రం వరకు గురు పుష్య యోగం ఉంటుంది. గురు పుష్య యోగం రోజున నిష్టగా పూజలు, దానధర్మాలు చేస్తే ఎన్నో ఉపయోగాలు కలుగుతాయని, మరికొన్ని గొప్ప యోగాలు సిద్ధిస్తాయని చెబుతున్నారు. మొత్తం ఈ రోజున 5 శుభ యోగాలు ఏర్పడతాయని చెబుతున్నారు. సర్వార్థ సిద్ధి యోగం, అమృత సిద్ధి యోగం, రవి యోగం, గురు పుష్య యోగం, గజకేసరి యోగం ఏర్పడతాయని చెబుతున్నారు.

ఈరోజు ఎలాంటి పని ప్రారంభించినా దిగ్విజయంగా కొనసాగుతుందని చెబుతున్నారు. గురువారం పుష్యమి నక్షత్రం కలిసివస్తే గురు పుష్య యోగం ఏర్పడుతుంది. గురు పుష్య యోగం రోజున విష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని, నిష్టతో పూజిస్తే ఆ ఇల్లు స్వర్గధామంగా మారుతుందని, స్వర్ణమయం అవుతుందని చెబుతున్నారు. నేడు దానధర్మాలు చేస్తే కూడా విశేషమైన ప్రయోజనాలు లభిస్తాయని, కొత్త వస్తువులను కొనుగోలు చేసినా మంచిదని పండితులు చెబుతున్నారు.
నేడు బంగారం, వెండి, ఇల్లు, భూమి, వాహనం వంటి వస్తువులను కొనుగోలు చేయడం ద్వారా మంచి జరుగుతుందని, మనం వేటినైతే కొనుగోలు చేస్తామో, వాటి విలువ రెట్టింపు అవుతుందని చెబుతారు. ఆర్థిక సమస్యల పరిష్కారం కోసం గురు పుష్య యోగం రోజున గోమాతకు బెల్లం,రొట్టెలు తినిపించటం మంచిదని సూచిస్తున్నారు. ఈరోజు ప్రత్యేకమైన రోజు కాబట్టి ఈరోజు ఎవరైతే డబ్బులు పెట్టుబడిగా పెడతారో వారికి రెట్టింపు లాభాలు వస్తాయని చెబుతున్నారు.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications