ఇంట్లో మనశ్శాంతి లేదా? గొడవలు జరుగుతున్నాయా? వాస్తు ప్రకారం ఇలా చేయండి
ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఎదురైనప్పుడు, కుటుంబంలో గొడవలు జరుగుతున్నప్పుడు, మనశ్శాంతి కోల్పోయినప్పుడు ఏం చేయాలో అర్థం కాకుండా ఉంటుంది. అటువంటి సమయంలో వాస్తు నిపుణులను సంప్రదిస్తుంటారు. కుటుంబంలో ఉన్న ప్రతికూల శక్తిని పారద్రోలేందుకు కొన్ని వస్తువులు కూడా ఉపయోగపడతాయని నిపుణులు చెబుతుంటారు. వారు చెప్పిన వివరాల ప్రకారం కొన్నిరకాల వస్తువులను మనం ఇంట్లో ఉంచుకుంటే ప్రతికూల శక్తిని పారద్రోలి, సానుకూల శక్తిని ఆహ్వానించవచ్చు.
ఇంటి ప్రధాన ద్వారానికి ఎదురుగా తులసి మొక్కను పెంచాలి.
ఈశాన్యంలో ఉంటే చాలా మంచిది.
అన్ని కష్టాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.
మొక్క ఎండిపోకుండా చూసుకోవాలి.
నిత్యం దీపారాధన చేయాలి.

నీళ్లను ఉపయోగించే పాత్రలు ఎప్పుడూ ఖాళీగా ఉండకూడదు.
మంచినీటి కుండ ఈశాన్యంలో ఉండాలి.
రాగి, ఇత్తడి, మట్టి పాత్రలను ఉపయోగించుకోవాలి.
ఈ పాత్రల్లో ఎప్పుడూ నీరు నిండి ఉండాలి.
ఇలా ఉంటే కుటుంబంలో శాంతి, శ్రేయస్సు, ఆనందం వెల్లివిరుస్తాయి.
ఇంటి ప్రధాన ద్వారం దగ్గర పంచముఖి ఆంజనేయస్వామి చిత్రపటాన్ని పెట్టుకోవాలి.
ఇలా చేస్తే ఎంతో శుభప్రదం.
దీనివల్ల కుటంబంలో ఎంతో శ్రేయస్సు కలుగుతుంది.
ఇంట్లో లక్ష్మీగణపతి విగ్రహాన్ని ఉంచుకోవాలి.
దేవుడి మందిరంలో ఉంటే చాలా మంచిది.
ప్రతి బుధవారం వినాయకుడికి గరిక సమర్పించాలి.
శుక్రవారం అమ్మవారికి కుంకుమ సమర్పించాలి.
ఇలా చేస్తే డబ్బుకు ఎప్పుడూ ఇబ్బంది రాదు.












Click it and Unblock the Notifications