వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సంప్రతింపుల్లో మేముండాల్సిందే:హురియత్‌

By Staff
|
Google Oneindia TeluguNews

శ్రీనగర్‌: యాభై ఏళ్ల కాశ్మీర్‌ సమస్య పరిష్కారం కోసంజరిగే ఏ సంప్రతింపుల్లోనైనా జమ్మూకాశ్మీర్‌ ప్రజలనుభాగస్వాములను చేయాల్సిందేనని ఆల్‌ పార్టీహురియత్‌ కాన్ఫరెన్స్‌ చైర్మన్‌ అబ్దుల్‌ ఘనీ భట్‌అన్నారు. వివాదంలో ప్రధాన భాగస్వామి అయిన కాశ్మీరీలను సంప్రతింపుల్లోభాగస్వాములను చేయకపోవడం సరైందికాదని ఆయన అన్నారు. జులై 14-16 తేదీల్లో భారత్‌-పాకిస్థాన్‌ల మధ్య జరిగే శిఖరాగ్ర సమావేశంవిషయంలో హురియత్‌లో విభేదాలు పొడసూపాయనేవార్తలను 23 గ్రూప్‌లతో కూడిన ఆల్‌ పార్టీహురియత్‌ కాన్ఫరెన్స్‌ చైర్మన్‌ ఖండించారు. తమ లక్ష్యాలనుసాధించడంలో అవరోధాలు కల్పించే విభేదాలేమీ లేవనిఆయన అన్నారు.

శిఖరాగ్ర సమావేశానికి ముందు భారత ప్రధానిఅటల్‌ బిహారీ వాజ్‌పేయిని గానీ, పాకిస్థాన్‌ అధ్యక్షుడుపర్వేజ్‌ ముషర్రాఫ్‌ను గానీ కలిసేందుకు అనుమతినిరాకరిస్తే తాము నిరుత్సాహ పడే సమస్యలేదని ఆయన సోమవారం విలేకరులతో అన్నారు.

శిఖరాగ్ర సమావేశం తర్వాతఇద్దరు నేతలను కలుసుకునేందుకు తమకు అనుమతి లభిస్తుందనిఆశిస్తున్నామని, సమావేశం తర్వాత కూడా వారిలో ఏ ఒక్కరినికలిసేందుకు కూడా అనుమతి లభించకపోతే తమఎత్తుగడలను మార్చుకుంటామని ఆయన అన్నారు. సమస్యనువిశాల, సానుకూల దృక్పథంతో తాము పరిశీలిస్తామనిఆయన చెప్పారు.

పాక్‌, భారత్‌లకు తాము రాసిన లేఖలకు సమాధానాల కోసంవారం రోజుల పాటు వేచి చూడాలని ఆల్‌ పార్టీహురియత్‌ కాన్ఫరెన్స్‌ నిర్ణయించింది.హురియత్‌ కాన్పరెన్స్‌ చర్చలు మూడు గంటల పాటుజరిగాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X