భారతి భారీ కాల్సెంటర్
న్యూఢిల్లీ: భారతి టెలీ టెక్ ప్రమోట్ చేసిన భారతి ఇన్ఫ్రా గుర్గావ్లోని ఇన్పోసిటీలో 1000 సీట్ల కాల్సెంటర్ను ప్రారంభిస్తున్నది. ఈ ఇన్ఫోసిటీని యూనిటెక్, హర్యానా అర్బన్డెవలప్మెంట్ అథార్టీ, సింగపూర్కు చెందిన కన్సార్షియం జాయింట్గా ప్రమోట్ చేసిన గుర్గావ్ టెక్నాలజీ పార్క్ లిమిటెడ్ ఏర్పాటు చేస్తున్నది.
ఇన్ఫోసిటీలో
భారతి
సంస్థ
ఇప్పటికే
మూడెకరాల
స్థలం
కొనుగోలు
చేసింది.
మొదట
ఈ
సెంటర్లో
వాయిస్మెయిల్
బిజినెస్ను
ప్రారంభించాలని
ఆ
తర్వాత
క్రమంగా
ఇ-మెయిల్,
డేటా
బేస్డ్,
వెబ్
బేస్డ్
లావాదేవీలను
కూడా
నిర్వహించాలని
భారతి
నిర్ణయించింది.
గుర్గావ్
కేంద్రాన్ని
అక్కడ
నిర్వహించే
కార్యకలాపాల
ప్రత్యేకత
దృష్ట్యా
కాల్సెంటర్
అని
కాకుండా
కాంటాక్ట్
సెంటర్
అని
వ్యవహరిస్తారు.
ఈ
కాంటాక్ట్
సెంటర్
రెండేళ్లలో
ప్రారంభమవుతుంది.
కాగా
హైదరాబాద్,
పూణ,
ముంబాయి,
బెంగుళూరుల్లో
త్వరలోనే
తాము
కాల్సెంటర్స్ను
కూడా
ప్రారంభిస్తున్నట్టుగా
భారతి
వర్గాలు
చెప్పాయి.