వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

84 మందితోతెలుగుదేశం జాబితా

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: రానున్న స్థానిక సంస్థలఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాలనురెండింటిని తెలుగుదేశం పార్టీ సోమవారంవిడుదల చేసింది. బిజెపికి అభ్యంతరం లేని 84జెడిపిటిసి అభ్యర్థుల జాబితాలనుతెలుగుదేశం విడుదల చేసింది. తొలి జాబితాను 54మంది జెడ్‌పిటిసి అభ్యర్థుల జాబితాను ముఖ్యమంత్రి,తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడుమొదట విడుదల చేశారు. ఆ తర్వాత రెండవ జాబితానుఆయన విడుదల చేశారు. ఈ 84 మంది అభ్యర్థుల్లో 26మంది మహిళలున్నారు.

పార్టీ ప్రధాన కార్యాలయం ఎన్‌టిఆర్‌ కార్యాలయంలో జరిగిన ఒక సమావేశంలో ఈ అభ్యర్ధులతో చంద్రబాబు సామూహిక ప్రమాణస్వీకారం చేయించారు. ఆ తర్వాత వారందరికీ బ-ఫారాలు ఇచ్చారు. తొలి జాబితాలో 18 మంది మహిళలు వున్నారు. ఎంపికైన అభ్యర్ధులంతా తమ ఆస్తుల వివరాలను ప్రకటించాల్సిందిగా పార్టీ అధినేత చంద్రబాబు అదేశించారు.

ఈ ఎన్నికల్లో తెలుగుదేశం ఘనవిజయం ఖాయమని ఆయన పేర్కొన్నారు. టిడిపి విజయంపై ప్రజలను తప్పుదోవ పట్టించడానికి కాంగ్రెస్‌ నానారకాల ప్రయత్నాలు చేస్తున్నదని ఆయన విమర్శించారు. ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టుతున్న పార్టీలకు ఎన్నికల్లో ప్రజలు గట్టిగా బుద్ధి చెబుతారని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధికి తెలుగుదేశం పార్టీ చేస్తున్న ప్రయత్నాలు, కృషితో కాంగ్రెస్‌ ఇతర రాజకీయ పార్టీలు కన్నుకుట్టి అబద్దపు ప్రచారం ప్రారంభించాయని చంద్రబాబు అన్నారు. అన్ని కోణాల్లోంచి ఆలోచించి అభ్యర్ధుల జాబితాను ఖరారు చేశామని మరో రెండు రోజుల్లో ఇంకో జాబితాను విడుదల చేస్తామని చంద్రబాబు తెలిపారు.

సీట్ల సర్దుబాటుపైతెలుగుదేశం, బిజెపిల మధ్య సోమవారంచర్చలు ప్రారంభమయ్యాయి. ఒకటి రెండురోజుల్లో బిజెపి తన అభ్యర్థుల జాబితానువిడుదల చేస్తుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X