రాష్ట్రపతి పాలనకే ఎన్డీఏ మొగ్గు!
న్యూఢిల్లీః తమిళనాడులో రాష్ట్రపతి పాలన విధించేందుకే ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలు మొగ్గు చూపాయి. సోమవారం జరిగిన ఎన్డీఏ సమావేశంలో ప్రధాని వాజ్పేయి వివిధ పార్టీల మనోభావాలను తెలుసుకున్నారు. తమిళనాడు వెళ్ళి వచ్చిన ఎన్డీఏ కన్వీనర్ జార్జి ఫెర్నాండెజ్ సమర్పించిన నివేదికను ఎన్డీఏ పరిశీలించింది.
ఇద్దరు కేంద్ర మంత్రులను అకారణంగా అరెస్టు చేయడంతో పాటు, 14 ఏళ్లు రాష్ట్రముఖ్యమంత్రిగా పని చేసినసీనియర్ నేత కరుణానిధిని అరెస్టు చేసిన తీరును ఎన్డీఏ తీవ్రంగా తప్పు పట్టింది. ఎన్డీఏ సమావేశం రాష్ట్రపతి పాలనకే మొగ్గు చూపిన దరిమిలా ఈ వ్యవహారంపై మంగళవారం జరిగే క్యాబినెట్ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.
ప్రభుత్వంపైకఠిన
చర్యకు
జార్జి
సిఫార్సు
తమిళనాడు
గవర్నర్
ఫాతిమాబీవీ
రీకాల్తోసరిపెట్టకుండా
జయలలిత
ప్రభుత్వంపైకఠిన
చర్యలు
తీసుకోవాలని
జాతీయ
ప్రజాస్వామ్యకూటమి
(ఎన్డిఎ)
నిజనిర్ధారణ
బృందం
కేంద్రప్రభుత్వాన్ని
కోరింది.
ఎన్డిఎ
కన్వీనర్
జార్జిఫెర్నాండెజ్
నేతృత్వంలోని
ముగ్గురు
సభ్యులఎన్డిఎ
బృందం
తమిళనాడులోని
పరిస్థితినిఅధ్యయనం
చేసి
నివేదిక
సమర్పించింది.
ముఖ్యమంత్రి జయలలితఆదేశానుసారమే కరుణానిధి అరెస్టు, తదితరసంఘటనలు జరిగాయని జార్జి ఫెర్నాండెజ్ అన్నారు.తమిళనాడు సంఘటనలపై నిర్ణయాన్ని కేంద్రప్రభుత్వానికే వదిలేస్తామని ఆయన విలేకరులతోచెప్పారు. జయలలిత ధోరణి చాలా ప్రమాదకరమైందనిఆయన అన్నారు. నియంతృత్వ పాలన లాంటిపరిస్థితులు తమిళనాడులో ఉన్నాయని ఆయనఅన్నారు.
నలుగురు సభ్యులతో కూడినహోం శాఖ ప్రతినిధి బృందం కూడా తమిళనాడుసంఘటనలపై కేంద్ర ప్రభుత్వానికి నివేదికసమర్పించింది.
- కరుణను కలిసిన ఎర్రంనాయుడు
- గురువాయురప్పకు ఏనుగునిచ్చిన జయ
- 3న రంగరాజన్ ప్రమాణ స్వీకారం
- తమిళనాడు బంద్ ప్రశాంతం
- ప్రభుత్వంపై కఠిన చర్యకు జార్జి సిఫార్సు
- ఫాతిమాపై వేటు-రంగరాజన్ కు బాధ్యతలు
- రాజ్యాంగాన్ని తుంగలో తొక్కిన జయః జార్జి
- నివేదిక పంపిన తమిళనాడు గవర్నర్
- కరుణను పరామర్శించిన జార్జి
- అట్టుడుకుతున్న తమిళనాడు
- జయలలితపై వాజ్ పేయి గరం
- జెలులో కరుణ సత్యాగ్రహం
- కరుణానిధి అరెస్టుః జైలుకు తరలింపు