దాసరి సభలో ఘర్షణలు
జగ్గయ్యపేటః
కృష్ణాజిల్లా
జగ్గయ్యపేటలో
సోమవారం
నాడు
ప్రముఖ
సినీ
దర్శకుడు,
కాంగ్రెస్
రాజ్యసభ
సభ్యుడు
దాసరి
నారాయణరావు
పాల్గొన్న
ఒక
సభలో
కాంగ్రెస్,
తెలుగుదేశం
కార్యకర్తల
మధ్య
తీవ్ర
స్థాయిలో
ఘర్షణలు
చెలరేగడంతో
పదిమంది
గాయపడ్డారు.
స్థానిక
మున్సిపాల్టీ
నిర్మించిన
షాపింగ్
కాంప్లెక్స్
ప్రారంభోత్సవానికి
కౌన్సిల్
సభ్యులు
దాసరిని
ఆహ్వానించడాన్ని
అభ్యంతరపెడుతూ
తెలుగుదేశం
సభ్యులు
ఘర్షణకు
దిగారు.
మాజీ
మంత్రి
నెట్టెం
రఘరామ్
సారథ్యంలోపెద్ద
సంఖ్యలో
తెలుగుదేశం
కార్యకర్తలు
ప్రారంభోత్సకార్యక్రమం
జరుగుతున్న
ప్రాంతానికి
చేరుకుని
కార్యక్రమాన్ని
అడ్డుకోవడానికి
ప్రయత్నించారు.
కాంగ్రెస్
కార్యకర్తలు
ఎదురుతిరగడంతో
ఉభయ
పక్షాల
మధ్య
ఘర్షణ
చెలరేగింది.
పరస్పరం
దాడులకు
దిగిన
కాంగ్రెస్,
తెలుగుదేశం
కార్యకర్తలను
చెదరగొట్టడానికి
పోలీసులు
రెండు
సార్లు
లాఠీచార్జ్
జరపాల్సివచ్చింది.