లాడెన్ కోసం గుహలపై బాంబుల వర్షం
కాబూల్ః ఒసామాబిన్ లాడెన్ దాక్కున్నట్లు భావిస్తున్న తూర్పు ఆఫ్ఘనిస్తాన్ లోని తోరాబోరాపర్వత గుహలపై అమెరికా బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడులతో పాటు లాడెన్ ను పట్టుకొనేందుకు ప్రత్యేక నావికా దళాలుజలాలాబాద్ సమీపంలో దిగాయి. కాంధహార్ ఎయిర్ పోర్ట్ పై పట్టు సాధించిన నార్తరన్ అలయెన్స్ దళాలు తాలిబన్లను నామరూపాల్లేకుండా చేసేదిశగా దూసుకుపోతున్నది.
మరోపైపు ఆఫ్ఘనిస్తాన్ లో జహీర్ షా సారధ్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకుబాన్ సమావేశంలో ఒక సూత్రప్రాయమైన అంగీకారం కుదిరినట్లు తెలిసింది. అయితే ఆఅంగీకారంలో కొన్ని సవరణలు చేస్తున్న దరిమిలా తుదిరూపం ఇవ్వడంలో కొంత ఆలస్యం జరిగుతున్నట్లు ఐక్యరాజ్య సమితి వర్గాలు చెబుతున్నాయి.
లాడెన్ దాక్కున్నట్లు భావిస్తున్న తోరా బోరా గుహలపై బాంబుల వర్షం కురిపించడంతో పాటు సుశిక్షితులైనసైనికులచేత కూడా దాడులు చేయించేందుకు అమెరికా సన్నాహాలు చేస్తున్నది. తోరాబోరా పై జరిగిన బాంబు దాడుల్లో కనీసం వందమంది అమాయక పౌరులు మరణించినట్లు తాలిబన్లు ఆరోపిస్తున్నారు. అవన్నీ అబద్ధాలని అమెరికా కొట్టిపారేస్తున్నప్పటికీ వందలాది మృతదేహాలు అమెరికా వ్యాఖ్యలను వెక్కిరిస్తున్నాయి.