వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆర్థికాభివృద్ధే ప్రాతిపదిక: రంగరాజన్‌

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: ఆర్థికాభివృద్ధే అన్ని పథకాల అమలుకు ప్రాతిపదిక కావాలని గవర్నర్‌ డాక్టర్‌సి. రంగరాజన్‌ సూచించారు. శనివారం సికింద్రాబాద్‌ పెరేడ్‌ గ్రౌండ్స్‌లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, గౌరవ వందనంస్వీకరించిన అనంతరం ఆయన ప్రసంగించారు.

ప్రజల మౌలికావసరాలు తీర్చే పనులు చేపట్టి అమలు చేస్తే లక్ష్యాలు సాధిస్తామని, ఇందుకు తగిన త్యాగాలు కూడా అవసరమని ఆయన అన్నారు. వ్యవసాయం, వైద్యం,సేవారంగాల్లోని ప్రగతి ప్రజలకు అందుబాటులోకి రావాలని ఆయన అన్నారు.

మన దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ బలపడిందని, ప్రజాస్వామ్యవిలువలను అందరూ పాటించడం అవసరమని ఆయన అన్నారు. ఉగ్రవాదంఅంతానికి ఐక్యంగా ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X