వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
అప్పులు చేస్తేతప్పులేదుః యనమల
హైదరాబాద్ః రాష్ట్ర బడ్జెట్ లో 7,800 కోట్ల రెవిన్యూ లోటు వుండే అవకాశం వుందని, దీనినిఅప్పులు తీసుకురావడం ద్వారా భర్తీ చేస్తామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పారు.అప్పులు చేసినప్పటికీ వాటిని అభివృద్ధి కార్యక్రమాలకు మళ్ళించడంలో తప్పులేదని బుధవారం తెలుగుదేశం పార్టీ నాయకులను ఉద్దేశించి ప్రసంగిస్తూ యనమల చెప్పారు. రెవిన్యూ లోటును భర్తీ చేసేందుకుఅప్పులు తీసుకురావడం మినహా మరో మార్గం లేదని, పన్నుల భారం మోపే అవకాశం లేదని యనమల అన్నారు.
Comments
Story first published: Wednesday, February 13, 2002, 23:53 [IST]