వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సంపన్న రాజ్యాలపై ప్రధాని ఆగ్రహం

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీః స్వేచ్ఛావాణిజ్యం విషయంలో అభివృద్ధి చెందిన దేశాలు ద్వంద్వ ప్రమాణాలు అనుసరిస్తున్నాయని ప్రధాన మంత్రి ఎబి వాజ్‌పేయి ఆరోపించారు. అవి విధించిన అసమంజసమైన ఆంక్షల కారణంగా భారతీయ ఉక్కు, తత్‌సంబంధిత రంగాలు తీవ్రంగా నష్టపోయాయని ఆయన పేర్కొన్నారు. గురువారం నాడు ఆయన ఉక్కురంగానికి చెందిన నిపుణుల సమావేశంలో పాల్గొన్నారు. అభివృద్ధి చెందిన దేశాలు స్వేచ్ఛావాణిజ్య మంత్రం పఠిస్తూ వర్ధమాన రాజ్యాల మార్కెట్లను కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నాయని ఆయన ఆరోపించారు.

ఈ సమావేశంలో ఉత్తమ ఇంటిగ్రేటెడ్‌స్టీల్‌ కర్మాగారానికి ఇచ్చే ట్రాఫీని ఆయన టాటా స్టీల్‌కుఅందజేశారు. ధనిక దేశాల కారణంగానే ఉక్కు పరిశ్రమ కడగండ్లను ఎదుర్కుంటున్నదని ఆయన చెప్పారు.దేశవ్యాప్తంగా వున్న ప్రధాన నగరాలను కలుపుతూ నిర్మిస్తున్న గోల్డెన్‌ ట్రయాంగిల్‌ రహదారి నిర్మాణం మొదటి దశకు కనీసం పదిలక్షల టన్నులస్టీల్‌ అవసరమని ఆయన పేర్కొన్నారు. జాతీయ రహదారుల అభివృద్ధి ప్రాజెక్టుకు ప్రభుత్వం 50 వేల కోట్లరూపాయలు ఖర్చుచేస్తున్నదని ఆయన చెప్పారు. 13 వేల కిలోమీటర్ల మేర ప్రపంచస్థాయి రోడ్లను నిర్మించనున్నట్టుగా చెప్పారు. ఈ ప్రాజెక్టు ఉక్కు రంగంసంక్షోభాన్ని కొద్ది మేర పరిష్కరించగలదని ఆయన వెల్లడించారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X